తెలంగాణ మంత్రులు ఇక మేం ఆగలేం అని అంటున్నారు. తెలంగాణ మంత్రలు తెగ తొందరపడుతున్నారు. అన్నం పోయ్యి మీద నుంచి దించక ముందే.. తెలంగాణ మంత్రలు తొందరపడుతున్నారు. అయితే తెలంగాణ బిల్లు లేటు కావటానికి కారణం ముఖ్యమంత్రే అని ఆవేశంతో ఊగిపోతున్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో చేరుకున్నతరువాత ఇక లేటు ఎందుకు? త్వరగా పని పూర్తి చేయాలని తెలంగాణ మంత్రలులు అంటున్నారు.
అయితే తెలంగాణ బిల్లు లేటు అవ్వటానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరన్ కుమార్ రెడ్డే అని తెలంగాణ మంత్రలు అంటున్నారు. గురువారం సాయంత్రానికే శాసనసభకు ముసాయిదా బిల్లు రావలసివున్నా సిఎం కిరణ్ హెచ్చరికతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బిల్లును శుక్రవారం సాయంత్రం వరకు తనవద్దే ఉంచుకున్నారని తెలంగాణ మంత్రులు ఆరోపించారు. ఢిల్లీ నుంచి రాష్ట్రపతి పంపించిన ముసాయిదా బిల్లును ఉద్దేశపూర్వకంగానే సిఎం కిరణ్ సభలో ప్రవేశపెట్టకుండా జాప్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని సోమవారం బిల్లును శాసనసభలో తీసుకురాకపోతే తామనుకున్నది చేస్తామని దిగ్విజయ్కు చెప్పినట్టు సమాచారం.
అంటే విభజన ముసాయిదా బిల్లు సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం కావాలని తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే సిఎం కిరణ్పై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ఆలోచనలో ఈ ప్రాంత నేతలు ఉన్నట్టు సమాచారం. దిగ్విజయ్ కు నేరుగా తెలంగాణ మంత్రులు ఇటువంటి హెచ్చరికలే జారీ చేసినట్టు చెబుతున్నారు. బిల్లును సభలో అడ్డుకునే ప్రయత్నం సిఎంతోపాటు సీమాంధ్ర మంత్రులు చేస్తున్నారని ఇందులో భాగంగానే వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ మంత్రులు ఆరోపించారు. శాసనసభలో సిఎంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా పార్టీ అధినాయకత్వానికి హెచ్చరికలు జారీ చేయాలని ప్రతిపాదించారు.
సిఎస్ మహంతితో విభజన బిల్లు అంశానికి సంబంధించి ఉపముఖ్యమంత్రి దామోదర్ పలుమార్లు ఫోన్లో సంప్రదింపులు జరిపారని, మూడు గంటల్లో శాసనసభకు ముసాయిదా బిల్లును పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల వరకు బిల్లు ప్రతులు చేరకపోవడంతో డిప్యూటి సీఎం దామోదర్ ఒకింత ఆగ్రహంతో ఉడికిపోయారు. అసెంబ్లీకి బిల్లు రాకుండా సిఎం కిరణ్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. కిరణ్ నాయకత్వంపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదని ఆయన నిరంకుశ వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ బిల్లును శాసనసభలో చర్చకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వైఖరి ఇలాగే కొనసాగితే నేరుగా ఆయనే ముఖ్యమంత్రి పదవినుంచి తొలగించాలని పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసి ఒత్తిడి చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. సోమవారం శాసనసభలో బిల్లు ప్రతిపాదనకు రాకపోతే అక్కడే సమావేశమై రాజీనామాల వ్యవహారం, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయాలని ప్రతిపాదించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more