ఈరోజు నుంచి ఏడు రోజుల పాటు అసెంబ్లీలో తెలంగాణ, సమైక్యాంద్ర వార్ జరగబోతుంది. సమైక్యాంద్రకు యుద్ద నాయకుడిగా..రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉండటం విశేషం. సీఎం ద్రుష్టి మొత్తం తెలంగాణ బిల్లును అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇక టీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ బిల్లు పాస్ కావటానికి నినాదాలు,వాదనాలు తెరపైకి తెచ్చారు. సిఎం కిరణ్ వర్సెస్ తెలంగాణ బిల్లు . ఓ వైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్ర. ప్రభుత్వంలోని పెద్దలే రెండు చీలిపోయిన నేపథ్యంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి.
బిల్లు కచ్చితంగా అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో సభలో ఎలాంటి చర్చ జరుగుతుందన్నది ఆసక్తి రేపుతోంది. బిల్లును అడ్డుకుంటామని సిఎం కిరణే స్వయంగా ప్రకటించడంతో ఇప్పుడు పార్టీల కన్నా ప్రాంతాల వారీగా ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠగా ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఏ పార్టీ ఎంత బలమెంతో చూద్దాం..
అసలు పార్టీల బలం ఎంత?
మన శాసనసభలో మొత్తం 294 మంది సభ్యులున్నారు. అందులో ఒకరు నామినేటెడ్ సభ్యురాలు. గతంలో 15 మందిపై వేటు పడింది. అంటే ఇప్పుడు 279 మంది సభ్యులున్నారు. తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు 119 మంది ఉంటే సీమాంధ్ర నేతలు 175 మంది ఉన్నారు. వేటు పడిన 15 మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే. ఈ లెక్కన సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న మొత్తం శాసన సభ్యుల సంఖ్య 160కి పడిపోయింది.
కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్కు 146 మంది సభ్యులున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుల్లో వేటు పడిన 9 మందిని తీసేస్తే మొత్తం సభ్యులు 88. ఇక తెలంగాణ ప్రాంత నుంచి కాంగ్రెస్ శాసన సభ్యులు 49. కాంగ్రెస్ పార్టీలో రెండు ప్రాంతాల శాసన సభ్యులు తమ తమ ప్రాంతాల అభిప్రాయాలకు అనుగుణంగా సభలో వాదనలు వినిపిస్తారు.
తెలుగుదేశం పార్టీ
టిడిపి నుంచి 80 మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో 47 మంది సీమాంధ్రకు చెందినవారు. ఆరుగురిపై వేటు పడింది. మొత్తం సీమాంధ్ర టిడిపి శాసన సభ్యులు 41 చేరింది. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యేలు 33. టిడిపి ఎమ్మెల్యేలు కూడా ప్రాంతాల వారీగా చీలిపోయి వాదనలు వినిపించడానికి రెడీ అవుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఇక వైసీపీకి 17 మంది సభ్యులున్నారు. వీరందరూ సమైక్యానికే మద్దతుగా నిలుస్తారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
టీఆర్ఎస్ 17 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరి స్టాండ్ తెలంగాణ.
ఎంఐఎం పార్టీ
ఎంఐఎం పార్టీలో ఏడుగురు సభ్యులున్నారు. అయితే వీరు ఎటువైపు ఉంటారో ఎవరు చెప్పాలేరు. అది చివరి నిమిషాంలో జరుగుతుంది.
సీపీఐకి నలుగురు సభ్యులున్నారు. వీరి స్టాండ్ కూడా తెలంగాణానే.
సిపిఎంకు ఒక సభ్యుడున్నారు. విభజనతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయాలని సిపిఎం డిమాండ్ చేయనుంది.
లోక్సత్తా పార్టీలో ఒక సభ్యుడున్నారు. లోక్సత్తా న్యాయం చేయాలన్న డిమాండ్ను వినిపించే అవకాశం ఉంది.
ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. వీరూ తెలంగాణకు అనుకూలంగానే ఉంటారు.
మొదటి నుంచీ తెలంగాణకు సై అంటున్న బిజెపికి ముగ్గురు సభ్యులున్నారు. మొత్తం మీద సీమాంధ్ర నుంచి 160 మంది, తెలంగాణ నుంచి 119 మంది ఎవరి ప్రాంత అభిప్రాయాలను వారు వెల్లడించే అవకాశముంది.
అయితే ఈ ఏడు రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాలపైనే రాష్ట్ర ప్రజలు ద్రుష్టిపెట్టారు. దీంతో ఈ ఏడు రోజుల్లో ఎవరికి పై చెయ్యి అవుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more