తెలంగాణ నేతలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడితే.. తెలంగాణలో నిదులు, వనరులు దండిగా ఉన్నయాని సంబరపడుతున్నారు. కానీ అసలు విషయం ఈరోజు బయటపడింది. ఇప్పటి వరకు భద్రాచలం తెలంగాణలో భాగమే అని చెబుతున్నా నాయకులకు మరో దెబ్బ పడింది. ఇప్పటి వరకు ఎవరు ఊహించని దెబ్బతో.. తెలంగాణ నేతలకు దిమ్మతిరిగిపోయింది. భద్రా చలం మీద జాతీయా స్థాయిలో లాభీయింగ్ మొదలుపెట్టిన నేతలకు శ్రీశైలం డ్యాం దెబ్బ తెలంగాణ నేతలను తాకింది. ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్ట్ రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలలో ఉందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అది కాస్త శ్రీశైలం ప్రాజెక్ట్ కేవలం రాయలసీమలోనే ఉన్నట్లుగా తేలడంతో తెలంగాణా నేతలు ఖంగుతిన్నారు.
శ్రీశైలం ఎడమ, కుడి వైపున ఉన్న విద్యుత్ ప్రాజెక్ట్ ఇరుప్రాంతాలకు సంబంధించినవి అనుకుంటుండగా ఇప్పుడు రెండు రాయలసీమ పరిధిలోనే ఉన్నట్లుగా గుర్తించారు. ఈ విషయం మీద తాజాగా జరిపిన లెక్కల ప్రకారం రెండూ రాయలసీమ పరిధిలోని నంది కొట్కూరు ఫారెస్ట్ పరిధిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. దీంతో భద్రాచలం విషయంలోనే కిందా మీద పడుతున్న తెలంగాణా నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
క ఒక్క శ్రీశైలం మాత్రమే కాదని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా గుంటూరు జిల్లా సర్వే నెంబర్లలో ఉందని టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు వాదిస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. శ్రీశైలం లాగానే నాగార్జున ప్రాజెక్ట్ కూడా ఆంధ్రా, తెలంగాణా మధ్య ఉండడంతో నేతలు ఇలా కొత్తరకాల వాదనలు తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే శ్రీశైలం రాయలసీమలో ఉందని తేలగా, నాగార్జున ప్రాజెక్ట్ కూడా ఆంధ్రాలో ఉందని తెలిస్తే మాత్రం తెలంగాణ నేతలకు నిద్రకరవుతుంది. దీంతో తెలంగాణ ప్రాంతంలోని రైతులు పూర్తిగా నష్టపోతారని సీమాంద్ర నాయకులు అంటున్నారు. సమైక్యాంద్ర కోసం పోరాడే సీమాంద్ర నాయకులకు శ్రీశైలం ప్రాజెక్ట్ బూస్ట్ తాగాలి గా తయారైంది. దీంతో సమైక్యవాదులు రెచ్చిపోయిన ఆశ్చర్యం లేదు. అయితే దీనిపై తెలంగాణ నేతలు ఏమంటారో చూద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more