రాష్ట్ర విభజన అంశం కీలకదశకు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన కీలక దశకు చేరుకున్న సమయంలో ప్రధాని నుంచి రాష్ట్రానికి చెందిన అగ్రనేతలకు పిలుపు వచ్చింది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం,పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం ప్రధానితో సమావేశానికి హాజరుకానున్నారు. రాష్టవ్రిభజన ప్రక్రియపై కసరత్తు చేస్తున్న గ్రూప్ఆఫ్ మినిష్టర్స్ ఆ దిశగా ఎంతో ముందుకు వెళ్లింది.
రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను మెయిల్స్ ద్వారా సేకరించింది. ప్రధాన రాజకీయ పార్టీలను కూడా అభిప్రా యాలు తెలపాలని కోరుతూ అఖిలపక్ష పక్ష సమావేశాలను ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్రమంత్రులు రాష్ట్ర విభజన నిర్ణయంపై కోందరు అనుకూలంగా మరి కొందరు వ్యతిరేకంగా ఎవరి అభిప్రాయాలు వారు చెబుతూ వస్తున్నారు. సీమాంద్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతతో ఆ ప్రాంత ఎంపిలు కూడా రాష్ట్రాని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వస్తున్నారు. కొందరు ఎంపీలు తమ సభ్యత్వాలకు రాజీనామాలు కూడా చేసి స్పికర్కు అందచేశారు.
అధికార పార్టీనేతలు తలోదారిలో పయనిస్తూన్నారు. ముఖ్యమంత్రికి మంత్రి వర్గానికి మద్య సమన్వయం కొరవడింది. ఈ దశలో రాష్ట్ర పరిస్ధితులపై ప్రధాని మన్మోహన్ సింగ్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు తన కార్యాలయంలో సమావేశం ఎర్పాటు చేశారు. సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కిరణ్కుమార్రెడ్డికి మూడురోజుల కిందటే పిలుపు అందింది. సీఎంతోపాటుగా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పిసిసి చీఫ్ బొత్స కు సమావేశానికి రావాలని ప్రధానమంత్రి కార్యలయం నుండి సమాచరం వచ్చింది. పౌరసరఫరాలశాఖమంత్రి శ్రీధర్బాబుకూడా ఈ సమావేశానికి హజరుకానున్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరద నష్టాలపై ప్రధానమంత్రి సమీక్ష చేయనున్నారని అధికారికంగా చెబుతు న్పప్పటికీ సమావేవం రాష్టవ్రిభజన , విభజన నిర్ణయానంతరం నెలకొన్న పరిస్థితులపైనే సమీక్ష జరగనున్నట్టు సమాచారం
ప్రధానితో అగ్రనేతల భేటీ సందర్భంగా హైదరాబాద్ కీలకాశం కానుంది. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేయాలా లేక పాలనను కేంద్రపరిధిలొకి తీసుకోవాలా , కేంద్రపాలిత ప్రాంతం చేయాల అన్న ప్రతిపాదనలపై ప్రధాని సమక్షంలో చర్చ జరగనుంది. నదీజలాలు, సాగునీటి పంపిణీ, విద్యుత్, ఆదాయ వనరులు తదితర అంశాలెన్నో రాష్ట్ర విభజనతో ముడిపడి ఉన్పప్పటికీ ప్రధానమంత్రి కీళకసమస్యలపైనే సమీక్ష జరపనున్నట్టు తెలుస్తోంది. ఇక సమైక్యరాష్ట్రం నుంచి విడిపోయి రాయలసీమ కోస్తాంద్ర జిల్లాలతో కలసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడే కోత్తరాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని కూడా ప్రధాని సమక్షంలో తేల్చబొతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more