సత్తిబాబు భార్య సీమాంద్ర నేతలకు షాకిచ్చారు. రీసెంట్ గా సత్తిబాబు కూడా సమైక్య సెగ తగిలిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) సమైక్యాంద్రకు మద్దతు తెలపకుండా చాలా జాగ్రత్తగా రాజకీయం నడిపిస్తున్నారు. అయితే సత్తిబాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువు చదివిన అతని భార్య ఎంపీ బొత్స ఝాన్సీ మాత్రం సీమాంద్ర నేతలకు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సీమాంద్ర నేతల నుండి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికి రాజకీయ పదవులకు మాత్రం రాజీనామా చెయ్యలేదు. రాజీనామా ఎందుకు చెయ్యలేదు అని గట్టిగా నిలదీస్తే.. రాజీనామా లేటర్ నా జేబులోనే ఉందని సత్తిబాబు, నా రాజీనామా లేఖ నా హ్యాండ్ బ్యాగ్ లో రెడీగా ఉందని బొత్స ఝాన్సీ మాటలతో సీమాంద్ర నేతలకు షాకిస్తున్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాలు, తెలంగాణపై కేంద్రం ముందుకు వెళుతున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్ లోని క్లబ్ హౌజ్ లో భేటీ అయ్యారు. అయితే మినిస్టర్స్ క్వార్టర్స్లోనే ఉన్నా భేటీకి రావడం ఇష్టంలేని ఎంపీ బొత్స ఝాన్సీ బయటకు వెళ్లిపోయారు. కాగా అధిష్టానం విభజనపై వెనక్కు తగ్గేది లేదని చెబుతుండడం, సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుండడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
దీంతో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు వీరంతా సమావేశమయ్యారు. ఈ భేటీకి కావూరి, పల్లంరాజు, పురంధేశ్వరి, ఎంపీలు లగడపాటి, బాపిరాజు, కేవీపీ, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు హాజరయ్యారు. అయితే రాజీనామాలు చేయాలా? వద్దా? అనే విషయంలో సీమాంధ్ర ప్రాంత ఎంపీల్లో ఏకాభిప్రాయం లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అంతకు ముందు వెల్లడించారు. ఏడుగురు సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు ఆమోదింపజేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కొంత మంది సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు కూడా రాజీనామాలకు సుముఖంగానే ఉన్నారని చెప్పారు. సత్తిబాబు సీమాంద్ర నేతల బేటి నుండి అలా వెళ్లిపోవటంతో సీమాంద్ర నేతలు, ప్రజలు మండిపడుతున్నారు. సోనియా గాంధీతో సత్తిబాబు భార్యకు సన్నిహిత సంబంధాలు పుష్కలంగా ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అధిష్టానానికి వ్యతిరేకంగా సత్తిబాబు, సత్తిబాబు భార్య ఎలా నడుసుకుంటారని కొంతమంది సీమాంద్ర నేతలు అంటున్నారు. రాష్ట్రం విభజన జరిగితే.. సీమాంద్రకు సత్తిబాబు సీఎం అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు ఢిల్లీ పెద్దలు, సత్తిబాబు వర్గీయులు అంటున్నారు. అలాంటి అవకాశాన్ని సత్తిబాబు, సత్తిబాబు భార్య ఎలా వదులుకుంటారు. అందుకే సీమాంద్ర నేతల భేటీ నుండి ఎంపీ బొత్స ఝాన్సీ వెళ్లిపోవటం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ విషయం పై సీమాంద్ర నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more