తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు దాదాపు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ పాదయాత్ర అనంతరం పార్టీ పుంజుకుంటుందనే ఆశతో ఉన్న సమయంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు పై స్పష్టమైన ప్రకటన చేయడం బాబుకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో తెలంగాణ ఏర్పాటుకు సపోర్టు చేయాలో, సమైక్యవాదిగా ఉండాలో తెలియని వింత పరిస్థితి. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపధ్యంలో పార్టీని రెండు ప్రాంతాలలో పటిష్టం చేయడానికి త్వరలో ‘ఆత్మగౌరవ బస్సుయాత్ర ’ పేరుతో త్వరలో యాత్ర చేపట్టడానికి సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సీమాంధ్రలో ఉన్న జగన్ పార్టీ పూర్తిగా సమైక్యవాదాన్ని వినిపిస్తూ ప్రజల్లోకి వెళుతుంది. అక్కడి ఉద్యమ తీవ్రతను, పార్టీలో నుండి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేని బాబు కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ... సీమాంధ్రకు సంబందించిన అంశాలను ఇప్పటికే ప్రధానికి లేఖ ద్వారా తెలియ చేశారు. సీమాంధ్రలో పార్టీ పట్టుకోల్పోకుండా బస్ యాత్ర చేయడం ద్వారా ప్రజలను తనవైపు మళ్లించుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు.
ఇప్పుడు జనంలోకి వెళ్లకపోతే ప్రత్యర్ధి పార్టీలు తమకు అనుకూలతను పెంచుకునే అవకాశం ఉంటుంది. దానిని తగ్గించడానికి , తనకు అనువుగా పరిస్థితులను మార్చుకోవడానికి ఈ ఆత్మగౌరవ బస్సు యాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నారు. అయితే యాత్రను పాదయాత్రలో మిగిలిన జిల్లాల్లో చేస్తారా ? లేక కొత్త రూట్ మ్యాప్ ని సిద్దం చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్ధితులు నెలకొనడం, పాలన కుంటుపడటం, అవినీతి పెరిగిపోవడంతో రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు కావాలని కాబట్టి ఇదే విషయాన్ని టీడీపీ ప్రజలకు చెప్పేప్రత్నం ఈ బస్సుయాత్ర ద్వారా చేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రతో కాస్తంత పుంజుకున్న టీడీపీ ఇఫ్పుడు తెలంగాణ ప్రకటనతో కాస్తంత వెనక్కి వెళ్లింది. బాబు యాత్ర ద్వారా పార్టీ పుంజుకొని, 2014లో అధికారాన్ని కట్టబెడుతుందో లేదో చూడాలి. మొత్తానికి బాబు ఈ యాత్రను ఓ ఛాంలెంజ్ గా తీసుకొని చేయబోతున్నారన్న మాట.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more