రాష్ట్ర విభజన ప్రకటన రాగానే కొన్నాళ్ళుగా నిద్రాణంగా ఉన్న తెలంగాణా నాయకులు కొందరు బాహాటంగా ముందుకొచ్చారు. అందులో మాజీ పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఒకరు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో సోనియా గాంధీ, ఇతర ముఖ్యనాయకులతో సమావేశమైన డిఎస్ భుజస్కంధాల మీద అధిష్టానం మరో బాధ్యతను అప్పగించినట్లుగా అర్థమౌతోంది.
నిజామాబాద్ సందర్శించిన డిఎస్ కి అక్కడి సిటీ కాంగ్రెస్ కమిటీ బ్రహ్మరథం పట్టింది. ర్యాలీతో ఘనంగా ఆహ్వనించిన మీదట డిఎస్ తన ప్రసంగంలో సోనియా గాంధీ మీద ప్రశంసలకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. తెలంగాణా విజయం సోనియమ్మ ఖాతాలోనే జమ కట్టాలన్నారాయన. అయితే బలిదానాలను చేసిన అమరవీరులకు కూడా ఆయన నివాళులర్పించారు కానీ రాష్ట్ర విభజన లో సోనియాదే ప్రముఖమైన పాత్రంటూ ఆమెను శ్లాఘించారు.
అంతకుముందు నిజామాబాద్ లోకి ప్రవేశించే ముందు ఆయన సాయిబాబా ఆలయంలో ప్రార్ధన చేసి ఆ తర్వాత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణా నిర్ణయం తీసుకోవటంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయని, వాటనన్నిటినీ అధిగమిస్తూ ఆమె ధైర్యంగా ప్రత్యేక తెలంగాణా నిర్ణయాన్ని ప్రకటించారని చెప్పిన డిఎస్, ఆ నిర్ణయాన్ని ప్రకటించిన మీదట ఇతర క్షేత్రాలనుంచి ఒత్తిడి వస్తున్నా, ఆమె ఎలాగైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని ఆయన తన విశ్వాసాన్ని ప్రకటించారు.
డిఎస్ తన ప్రసంగంలో ఇరు క్షేత్రాలవారినీ సంయమనాన్ని పాటించవలసిందిగా కోరుతూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎవరినీ చెయ్యవద్దని కోరారు.
ఇక తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం ఖాయమే కాబట్టి భవిష్యత్ కార్యాచరణలో తెలంగాణాలోని సహజ వనరుల సంపద ఎంతో మేలుచేస్తుందని, అభివృద్ధికి లోటుండదని డిఎస్ తెలంగాణా ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more