స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో తన అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సిఈవో, బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథన్ మయ్యప్పన్ ను నిన్న అర్థరాత్రి తరువాత క్రైంబ్రాంబ్ పోలీసులు అరెస్టు చేశారు. స్పాట్ ఫిక్సింగ్స్ కుంభకోణంలో ఈయన పై ఆరోపణలు రావడంతో ఇతన్ని విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన నిన్న సాయంత్రం క్రైంబ్రాంబ్ పోలీసుల ఎదుట విచారణ కు హాజరయ్యారు. ఈ విచారణలో పలు విషయాల పై ఆరా తీసిన పోలీసులు వారి వద్ద ఉన్న ఆధారాలతో ఇతని పాత్ర ఉన్నట్లు తేల్చి, విచారణ అనంతరం అరెస్ట్ చేసినట్లు ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసు బాస్ హిమంశురాయ్ తెలిపారు. ఊటి నుండి ప్రత్యేక విమానంలో ముంబయి చేరుకున్న ఆయన న్యాయవాదితో కలిసి పోలీసుల ముందు హాజరయ్యాడు. దాదాపు మూడు గంటల పాటు విచారించిన తరువాత ఇందులో కీలక వ్యక్తిగా భావిస్తున్న విందూ ధారాసింగ్ తో కలిసి కూడా ప్రశ్నించారు. వారిద్దరి నుండి పలు విషయాలు సేకరించి రికార్డు చేశారు. ఇక అరెస్టు చేసిన గురునాథన్ ని నేడు పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు.
తన అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సిఈవో అరెస్టైన పక్షంలో బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ రాజీనామా తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఉంటుందని, ఆయనకు పదవి గండం తప్పకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. బోర్డులో శ్రీనివాసన్కు మెజార్టీ సభ్యుల మద్దతు ఉంది. శ్రీనివాసన్ ఇప్పటికే రెండు పోస్టుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జట్టు ఓనర్, బిసిసిఐ అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. అల్లుడి ఫిక్సింగ్ వ్యవహారం మామ పదవికి గండం తెచ్చింది.
ఈ ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టు అయిన గురనాథన్ ప్రముఖ సినీ ప్రొడక్షన్ బ్యానర్ అయిన ’ఏవీఎం ప్రొడక్షన్ ’ కుటుంబానికి చెందినవాడు కావడం విశేషం. ఈయన ఆ ఏవీఎం నిర్మాణ సంస్థ అయిన బాలసుబ్రమణియన్ తనయుడు. ఈయన తమిళంతో పాటు వివిధ భాషల్లో సినిమాలు నిర్మించే ఈ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ కూడా. ఈయన ఫ్యామిలీ విషయానికి వస్తే భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటు క్రికెట్ అధినేత అల్లుడు కావడం, అటు ప్రముఖ నిర్మాణ సంస్థ యాజమాని కొడుకు కావడంతో ఈ ఫిక్సింగ్ వ్యవహారం రెండు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాను రాను ఈ వ్యవహారంలోకి ఎంతమంది పెద్ద తలకాలు వస్తాయో, ఎందరి పదవులు, కెరియర్ లు ముగుస్తాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more