వరంగల్ జిల్లా రాజకీయాల్లో బలమైన నేతగా ఎదిగిన కొండా దంపతులు సొంత నియోజవర్గమైన పరకాలలో తమకంటూ గట్టి వర్గాన్నే రూపొందించుకున్నారు. వైఎస్ రాజశేఖరెడ్డికి వీరాభిమానులుగా ముద్రవేయించుకున్నారు. వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీలో కీలకనేతల్లో ఒకరుగా ఉన్న కొండా సురేఖ ఆ పార్టీనుంచి బయటపడే అలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. తెంలగాణ ప్రాంతంలో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా ఉన్న కొండా సురేఖతోపాటు ఆమె భర్త కొండా మురళీ పార్టీని వీడాలన్న ఆలోచనకు వచ్చేందుకు కారణం పార్టీ అధిష్ఠానం పోకడలే కారణం అని కొండ ఆనుచరులు చెబుతున్నారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాదికాలం వ్యవధి ఉండగానే రాజకీయరంగం వేడెక్కుతోంది. రాజకీయ సమీకరణలు కూడా చక చక మారుతున్నాయి. తెలంగాణలో పార్టీకి బలమైన నేతగా ఉన్న స్ధాయి నుంచి జిల్లాస్ధాయి నేతకు పరిమితం చేస్తూ వచ్చారు. చివరకు వరంగల్ జిల్లాస్థాయి నాయకత్వం కూడా ప్రశ్నార్ధకంగా మార్చారు. పార్టీలో కొందరు పెద్దలే తమనేత పట్ల అడుగడుగునా అవమానకరంగా ప్రవర్తిస్తూ వచ్చారని కొండ అనుచరులోకరు పేర్కొన్నారు.
చివరకు వరంగల్ జిల్లాలో పార్టీ కన్వీనర్ పదవుల ఎంపికలో కూడా కొండా దంపతుల మాట చెల్లుబాటు కాకుండా పోయిందంటే వారిపట్ల పార్టీ అధిష్ఠానం ఎంత చులకనగా ఉందోస్పష్టమవుతోందంటున్నారు. పార్టీ అధిష్ఠానం పోకడలను జీర్ణించుకోలేక కొండ అనుచరులు అవేదనతో పార్టీ కార్యాలయ వద్ద ఇటీవల నిరసనలు తెలిపారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని, పార్టీ కార్యాలయానికి తాళం వేశారని ఆగ్రహించిన పార్టీ అధిష్ఠానం నోటీసులు జారీ చేసింది. దీనిపై కొండ దంపతులు మరింత మనస్తాపానికి లోనయినట్టు సమాచారం. పార్టీలో అంతర్గతంగా తమ పట్ల జరుగుతున్న చులకన భావాన్ని ఎప్పటికపుడు గమనిస్తున్న సురేఖ పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టుగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యాలయానికి రావటం కూడా మానేశారు. పార్టీలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితులన్నీ జైల్లో ఉన్న పార్టీ అధినేత జగన్కు తెలియకుండా జరగవన్న అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. మాజీమంత్రి కొండా సురేఖను తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయి.
ఇందుకోసం తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ సీనియర్ నేత ఒకరు కొండా దంపతులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్పార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో కొండా సురేఖతో పాటు ఎందరో కొత్తవారికి పార్టీలో తగిన గుర్తింపు ప్రాధాన్యం ఇచ్చి ప్రొత్సహించిందని, కొందరు తొందరపడి పార్టీ వీడినా తిరిగి తమ పొరపాటు తెలుసుకుంటున్నారని చెప్పుకొస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కూడా కొండ సురేఖ దంపతులను పార్టీలో చేర్చుకుంటే ఎలా ఉంటుందన్న అంచనాలు వేసుకుంటున్నారు. సురేఖ కాంగ్రెస్వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొండ దంపతులు మాత్రం పార్టీ వీడే ఆలోచనలో ఉన్నట్టు ఇంత వరకూ ఎక్కడా బయట పడలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more