నిన్న పార్లమెంటు సమావేశాలు ఊహించిన విధంగానే గందరగోళంతో ప్రారంభమయ్యాయి. తెలంగాణా రాష్ట్రానికి మద్దతుగా రాష్ట్ర విభజన మీద త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ తెలంగాణా ప్రాంతపు ఎంపీలు పార్లమెంటులో పల బయటా కూడా ఆందోళనచేసారు.
ముందు ఢిల్లీలో ఐదు సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగిన ఘటన విషయంలో ప్రతిపక్షాలన్నీ ఊకుమ్మడిగా పార్లమెంటులో ఆందోళన చెయ్యగా పార్లమెంటులో చర్చలు సాగే పరిస్థితి లేనందువలన స్పీకర్ మీరా కుమార్ సభను వాయిదా వేసారు. ఇంకా బొగ్గు కేటాయింపుల్లో అవకతవకలు, 2జి కుంభకోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తుండగా ప్రభుత్వం జోక్యం చేసుకోవటం, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద వేధింపులలాంటి అంశాలు పార్లమెంటుని కుదిపెయ్యగా, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే రాజీనామా చెయ్యాలనే డిమాండ్ కూడా పెరిగింది.
సభ తాత్కాలిక వాయిదా తర్వాత తిరిగి ప్రారంభిస్తుండగా, తెలంగాణా ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేకానంద, ఎస్.రాజయ్య, మందా జగన్నాధ్ లు పార్లమెంటు సభ్యులు వచ్చే దారిలో ప్లకార్డ్ లు చేతపట్టుకుని బైఠాయించారు. ఆ తర్వాత వెల్ లో కూడా ప్రవేశించి, మిగిలిన పార్టీలు చేస్తున్న డిమాండ్లకు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని కూడా జోడించి సభ ముందుకు సాగకుండా చేసారు.
తెలుగు దేశం పార్లమెంటు సభ్యుడు ఎమ్ పి రమేశ్ తెలంగాణా ఎంపీల వైఖరిని తప్పు పట్టారు. అంతకు ముందు తొమ్మిది మంది ఎంపీలలో రాజీనామా చేసే పనికి ఏడుగురే ముందుకొచ్చారు, ఇప్పుడేమో నలుగురు ఎంపీలే మిగిలారు, అందులోనూ ముగ్గురు తెరాస గుడారంలోకి పోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇదేనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే విధానం అంటూ ఎద్దేవా చేసారు.
మధు యాష్కీ దగ్గర బంధువుల మృతి వలన పార్లమెంటు సభలలో హాజరుకాలేకపోయారు కానీ, ఇతర ఎంపీలలో గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరు కాలేదు. హాజరైన పై నలుగురు రాష్ట్ర విభజనను కోరుతూ ఆందోళన చేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more