ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో.. అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ లు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. వీరితో పాటు కొంత మంది రాజకీయ మంత్రులు కూడా జైల్లో ఉన్న విషయం తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసును సీబీఐ స్పీడ్ పెంచింది. అయితే ఈసారి ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డిపై సీబీఐ కన్నుపడింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ ఐదో చార్జీషీట్ ను సీబీఐ న్యాయస్థానంలో దాఖలు చేసింది. రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రులు మోపిదేవి, ధర్మాన తదితరులపై సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. దాల్మియా, ఈశ్వర్ సిమెంట్ కంపెనీల పై సీబీఐ అభియోగాలను నమోదు చేసింది. మొత్తం 13 మంది పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. 46 మంది సాక్షులుగా 53 డాక్యుమెంట్లు సమర్పించింది. హోంమంత్రి సబితై ఐపీసీ సెక్షన్లు 120బి, 409, 420 కింద అభియోగాలు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 9, 12, 13, 13(1) ల కింద అభియోగాలు నమోదు చేసింది.
సండూర్ వవర్, లేపాక్షి నాలెడ్జ్ హబ్, భారతి సిమెంట్స్, పెన్నా, దాల్మియా, ఇండియా సిమెంట్స్పై విడివిడిగా చార్జ్షీట్లు నమోదు చేస్తున్నట్టు సి.బి.ఐ. తెలియజేసింది ఆ సమయంలో అయినవారికి భూములు పంచిపెట్టడానికి మొత్తం 26 జి.ఓ.లు విడుదల అయిన విషయాన్ని కూడా సి.బి.ఐ. ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఇప్పటికే మంత్రుల పేర్లు ఒకటొకటిగా బయటకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మోపిదేవి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ధర్మాన ప్రసాదరావుపై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ధర్మాన ఈ కేసు నేపథ్యంలో పదవికి రాజీనామా చేయగా, ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించలేదు. సబిత ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ అనుమతి లేదని సి.బి.ఐ. పేర్కొంటున్నది.
సీబీఐ ఛార్జీ షీటు ప్రకారం నిందితులు
ఏ1 జగన్,
ఏ2 విజయసాయి రెడ్డి,
ఏ3 దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా,
ఏ4 సబితా ఇంద్రారెడ్డి,
ఏ5 పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి శ్రీ లక్ష్మీ,
ఏ6 గనులశాఖ మాజీ సంచాలకుడు రాజగోపాల్
ఏ7 ఈశ్వర్ సిమెంట్స్ ఎండీ సజ్జల దివాకర్ రెడ్డి
ఏ8 దాల్మియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ సంజయ్ ఎస్ . మిశ్రా
ఏ9 దాల్మియా సీనియర్ మేనేజర్ నిల్ థమల్ భేరి,
ఏ10 దాల్మియా మేనేజర్ జైదీప్ బసు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more