ఉగ్రవాదిని పట్టుకున్నామని, వచ్చే హోలీ నాడు ఢిల్లీకి పెను ముప్పుని తప్పించామని నిన్న ప్రకటించిన పోలీసులు ఆత్మరక్షణలో పడ్డారు. పట్టుకున్న సయ్యద్ లియాకత్ షా, లొంగిపోయిన ఆతంకవాదులకు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ఇచ్చిన పునరావాస యోజనలో పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా వచ్చినవాడు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో నేపాల్ నుంచి వస్తున్నవాడు ఆయుధాలను కలిగివుండటమేమిటని అతని భార్య అమీనా బేగం అంటోంది.
తొమ్మిది సంవత్సరాల క్రితం కొందరు సాయుధ దళాలు తన భర్తను తీసుకుని వెళ్ళిపోయారని, కొన్నాళ్ళ తర్వాత తను పాకిస్తాన్ లో మన్సెహ్రాలో కూలీగా పనిచేస్తున్నాని లేఖ రాసాడని, ఆ తర్వాత కాశ్మీర్ లోయలో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోన్లలో అప్పుడప్పుడూ మాట్లాడుకోవటం జరిగిందని, అప్పుడు ఇంటికి వచ్చేయాలన్న తన అభీష్టాన్ని తెలియజేసాడని, దానితో కుప్వారా జిల్లా అధికారులను సంప్రదించి పునరావాస యోజన కింది లియాకత్ తిరిగి రావటానికి అనుమతిని పొందామని, అలా ప్రభుత్వ ప్రమేయంతో అది కూడా నేపాల్ నుంచి వస్తున్న మనిషి దగ్గర ఆయుధాలుండటం అసంభవమని చెప్తోంది కుప్వారా జిల్లాకు 105 కి.మీ దూరంలో జిందియాలా గ్రామంలో నివసించే అమీనా బేగం. వాళ్ళకి ఇద్దరు కొడుకులు- 21 సంవత్సరాల షాబిర్, 15 సంవత్సరాల సద్దామ్.
పోలీసుల కథనం ప్రకారం లియాకత్ నేపాల్ మార్గంలో దొంగతనంగా భారత్ భూభాగంలోకి ప్రవేశిస్తుంటే పట్టుకున్నారు, అతను హిజబ్ ఉల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకి చెందిన వాడు, అఫ్జల్ గురు ఉరిశిక్షకు ప్రతిగా ఢిల్లీలో ఆతంకవాద చర్యలు చేపట్టటానికి వచ్చాడు.
అయితే మీడియా ప్రతినిధుల ఎదురుగా తను అమాయకుడని, పోలీసులు తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అంటూ రోదించసాగాడు.
కానీ పోలీసులు తమ దర్యాప్తులో తేలినదాని ప్రకారం, లియాకత్ ని ప్రశ్నించగా, అతను ఢిల్లీ జామా మస్జీద్ ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ లో ఒక మనిషిని కలవటానికి వచ్చానని చెప్పాడు. పోలీసులు ఆ గెస్ట్ హౌస్ కి వెళ్ళి విచారించగా లియాకత్ చెప్పిన మనుషులు బయటకు వెళ్ళున్నారు. గెస్ట్ హౌస్ మేనేజర్ సమక్షంలో గది తలుపులు తీసి లోపలికి వెళ్ళిన పోలీసులు ఒక ఎకె 56 గన్, 30 రౌండ్లు, 3 చేతి బాంబులు, ఒక మెమొరీ కార్డ్ దొరికాయి. లియాకత్ కి అప్పజెప్పిన పని ఏమిటంటే కాశ్మీర్ వెళ్ళిపోయి అక్కడ ఉంటూ, కొత్తగా సంస్థలో చేరి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం నుంచి భారత్ లోకి వచ్చేవారికి సాయం చెయ్యటం,
రెండూ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న లియాకత్ భార్య అమీనా బేగమ్, పోలీసుల కథనాలలో ఏది సత్యమో ఇంకా తేలలేదు. సత్యాన్ని పలికించటంలో మన పోలీసులకు మంచి చాకచక్యం ఉన్న మాట నిజమే కానీ ఒక వేళ పొరపాటుగా తమ వలన తప్పు జరిగితే ఇది మా తప్పే అని ఒప్పుకున్న దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. 47 సంవత్సరాల లియాకత్ 15 సంవత్సరాల తర్వాత తన భార్యాబిడ్డలతో జీవించటానికి వస్తూ ఈ విధంగా ఇరుక్కుంటే మాత్రం అది ఎంతో బాధాకరమైన విషయం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more