నరేంద్ర మోడీ ఎవరు? 'ఆయన బీజేపీ నాయకుడు. గుజరాత్కు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయిన నాయకుడు' అని మాత్రమే చాలామందికి తెలుసు! కానీ... ఈ దేశ పారిశ్రామిక దిగ్గజాలకు నరేంద్ర మోడీలో అనేక కోణాలు కనిపిస్తున్నాయి. గాంధీనగర్లో ప్రారంభమైన 'వైబ్రంట్ గుజరాత్' పెట్టుబడిదారుల సదస్సులో ఈ దేశ అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీని ఆకాశానికి... అంతకంటే పైకి ఎత్తేశారు. ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై దేశీయ పారిశ్రామిక రంగం పొగడ్తల వర్షం కురింపించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీతోపాటు ఆయన సోదరుడు, అడాగ్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ, టాటా గ్రూప్ మాజీ అధినేత రతన్ టాటా పారిశ్రామిక రంగానికి మోడీ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రశంసించారు. వీరిలో 'అడాగ్' అధిపతి అనిల్ అంబానీ ముందు వరుసలో నిలిచారు. 'లక్ష్యాలను గురి చూసి కొట్టడంలో నరేంద్రభాయ్ అర్జునుడిలాంటి వాడు' అని తెలిపారు. మరో అడుగు ముందుకు వేసి... "ఓ కొత్త కోణం ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా. 1869 అక్టోబర్ 2: పోరుబందర్లో మహాత్మాగాంధీ జన్మించారు. 1875 అక్టోబర్ 31: ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జన్మించారు. 1932 డిసెంబర్ 28: ధీరూభాయ్ అంబానీ జన్మించారు. 1950 సెప్టెంబర్ 17: నరేంద్ర మోడీ జన్మించారు' అంటూ గుజరాత్లో జన్మించిన జాతీయ, విశ్వవిఖ్యాత ప్రముఖుల స్థాయిలో మోడీనీ చేర్చారు. అనిల్ అంబానీ అన్న, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీదీ అదే వైఖరి. 'ఒక గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు. పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తూ నిర్వహిస్తున్న మూడు రోజుల గుజరాత్ సమ్మిట్ ఇక్కడ ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ వౌలిక రంగ వసతుల కల్పనలో గుజరాత్ దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మోడీ గొప్ప దృక్పథం గల నాయకుడని కొనియాడారు. గుజరాత్లోనే మా ప్రస్థానం మొదలైందన్న ఆయన ఈ రాష్ట్రంలో మళ్లీమళ్లీ పెట్టుబడులు పెడతామని, లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామన్నారు. జమ్నగర్, హజిరా ప్రాంతాల్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నామన్నారు. రిలయన్స్ను గుజరాత్కు చెందిన సంస్థగా చెప్పుకోవడం గర్వకారణంగా ఉంటుందన్నారు. గుజరాత్లో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. అనిల్ అంబానీ మాట్లాడుతూ మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ స్థాయికి మోడీని పోల్చారు. అలాంటి గొప్పగొప్ప నాయకులతోపాటు తన తండ్రి ధీరూభాయ్ అంబానీ పుట్టిన ఈ గడ్డలోనే మోడీ జన్మించడం ఆనందంగా ఉందన్నారు. ఇక టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సైతం మోడీపై ప్రశంసలు కురిపించారు. పారిశ్రామిక పెట్టుబడులకు గుజరాత్ దేశంలోనే ఎంతో అనువైనదన్న ఆయన రాష్ట్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దిన ఘనత మోడీదేనన్నారు. మొదటిసారి గుజరాత్కు వచ్చినప్పుడే ఇక్కడ పెట్టుబడులు పెట్టలేనివారు ముర్ఖులనే అభిప్రాయాన్ని తాను వెలిబుచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. రెండోసారి విచ్చేసే సమయానికి ఎలాంటి పెట్టుబడులు ఇంకా పెట్టకపోయేసరికి ఆ ముర్ఖుల్లో నేను ఒకరిని అయిపోయానన్నారు. అయితే ప్రస్తుతం గుజరాత్లో టాటా గ్రూప్ 34,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టిందన్నారు. కాగా, ఈ సమ్మిట్కు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more