అక్రమా ఆస్తుల కేసుల అరెస్టై జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి మరో దెబ్బ తగిలింది. జగన్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మొదటి 51 కోట్లలకు అలాచ్ మెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఏకంగా 143 కోట్ల ఆస్తులపై ఈడీ విచారణ మొదలు పెట్టింది. రెండో విడతగా జగన్ ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ చేసింది. రూ.143 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. మనీలాండరింగ్ చట్టం 5(1) కింద ఆస్తులను జప్తు చేసింది. గతంలో మొదటి విడతగా జగతి, జననీ ఇన్ఫ్రాకు సంబంధించిన రూ.51.2 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మున్ముందు మరిన్ని ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. సీబీఐ రెండో చార్జీ షీట్ లెక్కల ప్రకారమే ఈ మొత్తాన్ని ఈడీ అటాచ్ చేసింది. రాంకీ ఫార్మాసిటీకి చెందిన 133.74 కోట్ల విలువైన 135.46 ఎకరాల భూమి,3.20 కోట్ల డిపాజిట్లు, జగతి పబ్లికేషన్కు చెందిన రూ.10 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు, మ్యుచువల్ ఫండ్స్ నుంచి రూ.3.20 కోట్లను అటాచ్మెంట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. మరోవైపు ఈడీ దర్యాప్తులో రాంకీ ఫార్మాసిటీ అక్రమాలు బహిర్గతమయ్యాయి. రూ.133.71 కోట్లకు గ్రీన్బెల్డ్ ఏరియాలోని భూమి అమ్మకం జరిగింది. దానికి ప్రతిగా రాంకీ చైర్మన్ అయోధ్యరామిరెడ్డి జగతిలో రూ.10 కోట్ల పెట్టుబడులను పెట్టారు. నాన్సెజ్ ఏరియాలో 23 ఫ్లాట్లు, సెజ్ ఏరియాలో 8 ఫాట్లు అక్రమంగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. వైఎస్ హయాంలో లబ్ది పొందిన కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని, ఇది ఖచ్చితంగా క్విడ్ ప్రోకోనే అని ఈడీ నిర్థారించింది. వైఎస్ హాయాంలో సెజ్లు, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు, మైనింగ్ కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వెంచర్ల ద్వారా చాలా కంపెనీలు లబ్ది పొందాయని, అందులో రాంకీ ఫార్మా సిటీ ఒకటని ఈడీ పేర్కొంది. ఈ విషయంతో పార్టీలో నాయకుల్లో మరి కొంచెం భయం పట్టుకుంది? మొన్న 51, ఈ రోజు 143 ఇలా ఈడి దూకుడు పెంచుకుంటూ పోతే.. చివరకు పార్టీ పరిస్థితి ఏమిటి? అని వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more