ఒక అమ్మాయి పై రేప్ జరిగితే ఆ అమ్మాయి పై జాలి చూపించటం సహజంగా జరుగుతుంది. కానీ అలా రేస్ చేసిన మగవాడిని సమాజం చీ కొట్టుడుతుంది. ఆ వ్యక్తి నుండి ప్రజలు దూరంగా జరుగుతుంది. అలాంటి వారికి సమాజంలో విలువు ఉండదని దేశ ప్రజలు అంటారు. కానీ ఎంతమందిని రేప్ చేస్తే అంత విలువు పెరుగుతుందని మన రాజకీయ పార్టీలు నిరూపించాయి. సమాజం చీదరించుకున్న వ్యక్తికి రాజకీయ పార్టీలు రాచబాట వేశాయి. సమాజంలో విలువలేని వ్యక్తిని .. అందలం ఎక్కించిన ఘనత మనదేశ రాజకీయ పార్టీలదేనని ఒక సంస్థ బహిరంగంగా చెప్పటం జరిగింది. సమాజంలో ఒక పిచ్చి కుక్క కనబడితేనే దాన్ని రాళ్లతో కట్టి చంపుతారు. అలాంటిది మహిళలపై అత్యాచారం చేసి దర్జగా, తెల్ల బట్టలు వేసుకోని సమాజంలో తిరుగుతున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం అండదండాలు ఉన్నాయి. అంటే సమాజంలో పాడు పని చేసిన వ్యక్తే ఇప్పుడు సమాజాన్ని ఉద్దరించే వ్యక్తిగా మారాడు కాబట్టి .. ప్రభుత్వం అలాంటివారికి అండగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దేశం మొత్తం మీద ఏ రాజకీయ పార్టీలో ఎంత మంది ఉన్నారో .. ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) విడుదల చేసింది. మహిళలపై జరిగే అత్యాచారాలను రాజకీయ పార్టీలు ఒకవైపు తీవ్రంగా ఖండిస్తూనే మహిళల పట్ల అమానుషంగా వ్యవహరించి మానభంగం చేసే వారిని ఎన్నికల బరిలోకి దించేందుకు ఏ మాత్రం సంకోచించటం లేదు. మహిళలపై అత్యాచారాలు చేసిన రేపిస్టులకు పార్టీలు టికెట్లు కేటాయిస్తుండటం విచారించాల్సిన అంశం. ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) విడుదల చేసిన సమాచారం ప్రకారం ఇద్దరు పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల్లో 36 మంది శాసన సభ్యులు మహిళలపై వివిధ అత్యాచారాలకు పాల్పడినట్లు వెల్లడించింది.
ఢిల్లీలో ఇటీవల జరిగిన గ్యాంగ్రేప్ నేపథ్యంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన ప్రజాప్రతినిధుల వివరాలను ఎడిఆర్ సంస్థ విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఇచ్చే అఫిడవిట్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించినట్లు ఆ సంస్థ తెలిపింది. కాంగ్రెస్, బిజెపి, సమాజ్వాదీ, బిఎస్పి, తెలుగుదేశం వంటి పార్టీలు మహిళలపై అత్యాచారాలు చేసిన వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు కేటాయించినట్లు ఎడిఆర్ వెల్లడించింది. అన్నా డిఎంకెకు చెందిన సాలెం ఎంపీ ఎస్ సెమ్మలై, తృణమూల్ కాంగ్రెస్కు చెందిన తమ్లుక్ ఎంపీ సువేందు అధికారిపై మహిళలపై అత్యాచారాలు చేసిన కేసులు నడుస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన ముగ్గురు శాసన సభ్యులు శ్రీ్భగవాన్ శర్మ, అనూప్ సందా, మనోజ్కుమార్ పారస్, బిజెపి శాసన సభ్యుడు మహమ్మద్ అలీంఖాన్, గుజరాత్కు చెందిన బిజెపి శాసన సభ్యుడు జేతాభాయి అహిర్, తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం జిల్లా కదిరి శాసన సభ్యుడు కందికుంట వెంకటప్రసాద్పై రేప్ కేసులున్నట్లు ఎడిఆర్ సంస్థ తెలిపింది. మహిళల పట్ల అత్యాచారాలు చేసినట్లు తమ అఫిడవిట్లలో అంగీకరించిన ముప్పై ఆరు మంది శాసన సభ్యుల్లో కాంగ్రెస్కు చెందిన ఆరుగురు, బిజెపికి చెందిన ఐదుగురు, సమాజ్వాదీ పార్టీకి చెందిన ముగ్గురు ఉన్నారు. మహిళలపై అత్యాచారాలు చేసిన శాసన సభ్యులలో ఎనిమిది మంది ఉత్తర ప్రదేశ్కు చెందినవారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందిన వారు ఏడుగురు చొప్పున ఉన్నారు. గత ఐదు సంవత్సరాల్లో రేప్ కేసులున్న ఇరవై ఏడు మంది వివిధ శాసన సభలకు పోటీ చేసి ఓడిపోయారని ఎడిఆర్ సంస్థ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more