ఢిల్లీలో వైద్యవిద్యార్థిపై జరిగిన సంఘటనకు యావత్ దేశం నలుముల నుండి నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటీ సంఘటనలపై కఠినమైన శిక్షలు వేయాలని మహిళ సంఘాలు కోరుతున్నాయి. ఆ నిందితులకు జీవితాంతం కుమిలి పోయే విధంగా కఠిన శిక్షలు వేయాలని మహిళమణులు అంటున్నారు. భవిష్యతుల్లో ఏ మహిళకు ఇలాంటి ఘోరమైన సంఘటన జరగకుండా ఉండలంటే వారికి తగిన శిక్ష విధాంచాలని మహిళలు కోరుతున్నారు. అత్యాచారం వంటి నేరాలకు పాల్పడే నిందితులను నపుంసకులుగా( వారిది కోసి చేతిలో...) చేయాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ మమతా శర్మ డిమాండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నడుస్తున్న బస్సులో యువతిపై సామూహిక అత్యాచారం చేయడం సభ్యసమాజం తలదించుకునే ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘోరాలకు మరెవరకూ పాల్పడకుండా కఠిన శిక్ష విధించాలని ఆమె సూచించారు. రేపిస్టులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాలని ఆమె అన్నారు. ‘ఢిల్లీ దోషులకు ఉరిశిక్షే సరైంది లేదా వారిని నపుంసకులుగా చేయాలి. దీంతో రోజూ కుమిలి కుమిలి ఏడ్వాలి. రేపిస్టులకు కఠినమైన శిక్షలు వేయకపోతే సమాజంలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేరు. ఇలాంటి దురాగతాలు మళ్లీ మళ్లీ జరిగే ప్రమాదం ఉంది’ అని ఆమె స్పష్టం చేశారు. ఇరవై మూడేళ్ల పారామెడికల్ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన ఒక్క ఢిల్లీయే కాక యావత్ దేశం సిగ్గుపడాల్సిన విషయమని ఆమె చెప్పారు.
ఇలాంటి కేసుల విషయంలో శిక్షలు అత్యంత కఠినంగా ఉండాలని శర్మ పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజధానిలో సమావేశంలో దీనిపై ఒక తీర్మానం ఆమోదించారు. రేపిస్టులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రత చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీసు పెట్రోలింగ్ పెంచడంతో పాటు వాహనాలకు నల్లరంగు అద్దాలు తొలగించాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. ఇలాంటి సున్నితమైన కేసు విచారణను డిప్యూటీ సూపరింటిండెంట్ స్థాయి అధికారితో జరపించాలని చైర్పర్సన్ మమత ప్రభుత్వానికి సూచించారు. ఢిల్లీ సంఘటకు సంబంధించి నెలలోపు తమకు సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా ఆమె ఆదేశించారు. మమత లాంటి వారు ఘోరం జరిగిపోయిన తరువాత మాట్లాడటం కంటే.. ముందే మహిళల గురించి, వారి హక్కులు కోసం పోరాటం చేస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేవని దేశ మహిళలు అంటున్నారు. ఇప్పటికే ఇలాంటి స్పదించటం మహిళలకు మంచిదని కొన్ని మహిళ సంఘాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more