హైదరాబాద్ లోని బేగంపేట అర్థరాత్రి ఉలిక్కిపడింది. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ కి మొట్టమొదటి ఎయిర్ పోర్టు అయిన బేగం పేట విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో నాలుగు చార్టర్డ్ విమానాలు, ముఖ్యమంత్రి ఉపయోగించే హెలికాప్టర్ కూడా కాలి బూడిది అయ్యాయి. అర్థరాత్రి దాటిన తరువాత ఈ అగ్రి ప్రమాదం జరగడంతో భారీ ఆస్థినష్టం వాటిల్లినట్లు తెలుస్తుంది. బోయిన్ పల్లిలోని విమానాలకు మరమత్తులు చేసే షెడ్డులో అర్థరాత్రి దాటిన తరువాత మంటలు చెలరేగాయి. వీటిని సెక్యూరిటీ సిబ్బంది గమనించక పోవడంతో అక్కడ ఉన్న మరో రెండు షెడ్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న అగ్ని మాపక యంత్రాలు మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి, కానీ అప్పటికే మంటలు భారీగా విస్తరించడంతో మంటలు అదుపుకాలేక పోయాయి. దీంతో హైదరాబాద్ లో ఉన్న 11 ఫైర్ స్టేషన్ల నుండి ఫైర్ ఇంజన్లను తెప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం వీటితోనే కాకుండా, అత్యాధునికంగా కార్బన్ డయాక్సైడ్ ఫోమ్తో మంటలు ఆర్పే యంత్రాలనూ రప్పిస్తున్నారు.
ఎయిర్ పోర్ట్ చుట్టు భారీ కంచె ఉండటంతో మంటలు ఆర్పేందుకు చాలా కష్టంగా మారింది. డిజిటల్ హైడ్రాలిక్ యంత్రాలు మంటలను ఆర్పేందుకు బయటి నుంచే ప్రయత్నిస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత పేలుడు శబ్దాలు కూడా వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. విమానాశ్రయం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉండేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ప్రమాదానికి కారణాల పై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గురైన షెడ్డులో ఈ ఇంధన బ్యారెళ్లు ఉండటం వల్లనే మంటలు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కేవలం అతి ముఖ్యుల రాకపోకలకు, వైమానిక విన్యాసాలకు మాత్రమే ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లాంటి వీఐపీలు కూడా ఈ విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే స్థానికులు మాత్రం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more