Heavy rains likely across Telangana for next three days రాష్ట్రానికి మళ్లీ వర్ష సూచన.. రానున్న మూడు రోజులు వర్షాలే.!

Several districts of telangana likely to recieve heavy rainfall for next three days

Rain alert to few districts of Telangana, as India Meteorological Department (IMD) indicated that comming three days the state is likely to experiance moderate to heavy rainfall. Yellow alert to Adilabad, Yellow alert to Kumram Bheem Asifabad, Mancherial, Nirmal, Jagtial, Jayashankar Bhupalpally, heavy rainfall to 24 districts of Telangana, Nizamabad, Rajanna Sircilla, Karimnagar, Peddapalli, Mulugu, Bhadradri Kothagudem, Siddipet, Yadadri-Bhongir, Rangareddy, Hyderabad, Medchal-Malkajgiri, Vikarabad, Sangareddy, Medak, Kamareddy, Mahbubnagar districts.

In the wake of cyclonic circulation, many parts of the State are likely to record heavy rainfall over the next three days. According to the IMD, districts like Kumurambheem-Asifabad, Mancherial, Jagtial, Peddapalli, Jayashankar-Bhupalapally, Mulugu, Bhadradri-Kothagudem, Khammam, Nalgonda, Suryapet, Mahabubabad, Warangal, Hanamkonda, Jangaon, Siddipet, Yadadri-Bhongir, Rangareddy, Hyderabad, Medchal-Malkajgiri, Vikarabad, Sangareddy, Medak, Kamareddy and Mahbubnagar will see heavy rainfall.

రాష్ట్రానికి మళ్లీ వర్ష సూచన.. రానున్న మూడు రోజులు వర్షాలే.!

Posted: 10/03/2022 12:23 PM IST
Several districts of telangana likely to recieve heavy rainfall for next three days

తెలంగాణకు వరుణ గండం తప్పినట్టు లేదు. ఇప్పటికే వర్షాకాలం ఆరంభం నుంచి సాధారణం కన్నా మూడింతల ఎక్కువ వర్షపాతం నమోదైనా.. ఇప్పటికీ రాష్ట్రాన్ని వరుణుడు వీడటం లేదు. నైరుతి రుతుపవనాలకు ముందు నుంచి రాష్ట్రంలో విస్తారంగా కురిసిన వర్షాలు.. రుతు పవనాలు తిరోగమనమైనా.. వరుణుడు మాత్రం ఇంకా తన ప్రభావాన్ని చాటు తూనే వున్నాడు. గడిచిన మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారన్న కురిసిన వర్షాలతో పండగ సంబరాలన్నీ హరించుకుపోతున్నాయి. ఈ క్రమంలో మరోమారు రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని ఏకంగా పలు జిల్లాల వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగ‌ళ‌వారం నుంచి మూడు రోజు‌ల‌పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నదని హైదా‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. ఏపీ తీరం‌లోని పశ్చిమ మధ్య బంగా‌ళా‌ఖా‌తంలో ఉన్న ఆవ‌ర్తనం సము‌ద్రమ‌ట్టా‌నికి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నదని వివ‌రిం‌చింది. ఈశాన్య బంగా‌ళా‌ఖాతం పరి‌స‌రాల్లో ఏర్పడిన మరో ఆవ‌ర్తనం సము‌ద్రమ‌ట్టా‌నికి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు విస్తరించి ఉన్నదని తెలి‌పింది.

వీటి ప్రభా‌వంతో బుధ‌వారం నుంచి మూడు రోజు‌ల‌పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నదని వాతా‌వ‌రణ కేంద్రం ప్రాథ‌మిక హెచ్చ‌రిక జారీ చేసింది. కాగా, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. కొమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ప్రజలను కష్టాలపాటు చేస్తున్నాయి. ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వర్షాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. కాగా, ఏపీ సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడులో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణశాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles