తల్లీ, బిడ్డల మధ్య ఉండే ప్రేమ, ఆనురాగం, ఆప్యాయత, అనుబంధం.. మాటల్లో చెప్పలేనిది. బిడ్లల కోసం తల్లులు ఎంతగా శ్రమిస్తారో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి మధ్య బలమైన అనుబంధం మనుషులకు మాత్రమే పరిమితం కాదు.. అన్ని రకాల జీవరాశుల్లోనూ ఇదే తరహా బంధం కొనసాగుతుంటుంది. తమ మనస్సుల్లో ఉన్న ప్రేమను మాటల్లో వ్యక్తపర్చే అవకాశం మనుషులకు ఉంటుంది. కానీ మూగజీవాలకు ఆ అవకాశం ఉండదు.. తమ చేతల్లోనే తమ మమకారాన్ని ప్రదర్శిస్తుంటాయి. నెట్టింట్లో ఇలాంటి వీడియోలు ఎన్నో.. కానీ వాటిని చూస్తుంటే మనసులు కదిలి కన్నీళ్లు వచ్చేస్తుంటాయి.
కొన్ని నెలల క్రితం ఇలాంటి వీడియో ఒకటి తల్లి ప్రేమను ఆవిష్కరించింది. నదిలోకి వెళ్లి ఈత కొడుతున్న జింక పిల్లను అదే నదిలోని మొసళ్లు చుట్టుముట్టుతున్న నేపథ్యంలో తన బిడ్డ ప్రాణాలకు ఎలాంటి హానీ కలగకూడదని ఆ తల్లి జింక నేరుగా నీళ్లలోకి దూకి మొసళ్లకు ఆహారంగా మారింది. ఉపద్రవం ముంచుకొస్తున్నా.. తమ బిడ్డను కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన పని నెటిజనుల కదిలించింది. కన్నీళ్లు పెట్టించింది. తాజాగా ఇలాంటిదే మరో వీడియో చూసి నెటిజనులు కూడా చలించిపోతున్నారు. అయితే ఇక్కడ తల్లి లేదు. కానీ ఆ తల్లి ఎక్కడో తప్పిపోయిందన్న బాధతో అన్వేషణ సాగిస్తున్న ఓ పిల్ల గుర్రం వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది.
నెటిజనులు అయ్యో పాపం.. అంటూ బాధతప్తంతో తమ స్పందనలను తెలియజేస్తున్నారు. అలాంటి ఎక్స్ప్రెషన్ ఒక్కోసారి మనకు తెలియకుండానే కంటతడి పెట్టిస్తుంటాయి. అలాంటి సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోయంబత్తూరులోని పేరూర్లో ఓ గుర్రం.. బస్సు వెనుక పరుగులు తీసింది. ఎందుకో తెలుసా..? ఆ బస్సుపై మరో గుర్రం బొమ్మ ఉండడంతో.. అది తన తల్లి అనుకుని బస్సు వెనుక పరుగెత్తింది. తల్లి గుర్రం వెంట పిల్ల గుర్రం పరుగెత్తడం ఆ ప్రాంతంలోని ప్రజలను కలవరపెట్టింది. అయ్యో దానికైమైనా జరిగితే.? బస్సు కిందకు వస్తే ప్రమాదం తెచ్చుకోవడమే కాదా అంటూ కంగారుపడ్డారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో.. వీక్షకులనందరిని కదిలిస్తుంది. దానిని చూసిన వారు కొన్ని నిమిషాల పాటు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
తమిళనాడు కోయంబత్తూరులోని పేరూర్లో పట్టీశ్వర దేవాలయం సమీపంలోని దర్పణం మండపం, పడితుర ప్రాంతాల్లో పదికి పైగా గుర్రాలు తిరుగుతున్నాయి. అవి ఆప్రాంతంలో పచ్చిగడ్డి మేస్తుంటాయి. అయితే వారం క్రితం ఆ పిల్ల గుర్రం మందలోని నుంచి తప్పిపోయింది. అది తల్లి గుర్రాన్ని వెదుక్కుంటూ ఆ ప్రాంతంమంతా తిరుగుతుంది. వారం రోజులు గడిచినా తన తల్లి ఆచూకీ మాత్రం లభించలేదు.
ఇదే సందర్భంలో ఓ బస్సుపై ఉన్న గుర్రపు బొమ్మను చూసి.. ఆ బొమ్మే తన తల్లి అనుకుంది. కాసేపు అక్కడే అటుఇటూ తిరిగింది. ఇంతలో బస్సు స్టార్ట్ కావడంతో తన తల్లి పరిగెత్తుతుందనే భావనతో పిల్ల గుర్రం కూడా బస్సు వెంట పరుగు తీసింది. ఈ ఘటనను కొందరు తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ గుర్రవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు ఉద్వేగంగా స్పందిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు ఇటీవల తాము చూసిన బెస్ట్ వీడియో ఇదేనని అంటున్నారు. ఇంటర్నెట్లో చూసిన అద్భుతమైన విషయమని పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more