జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకువస్తామంటారా.. కరెక్టే కానీ.. వందకు, ఐదొందలకు కార్డు పెట్టి లాగేసుకుంటామంటే ఇకపై కుదరదు. ఏందుకని అంటే.. ఇకపై ఎలాపడితే అలా.. డబ్బును విత్ డ్రా చేస్తే.. బ్యాంకులు కూడా బాదేుస్తాయి. ఔనా.. మళ్లీ నోట్ల రద్దుకు పూర్వస్థితి మాదిరి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయా.? అంటే కాదనలేం.
ఉచిత లావాదేవీలను పరిమితం చేస్తూ, ఆపై చేసే ప్రతి లావాదేవీకి చార్జీలు వసూలు చేయాలని దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు నిర్ణయించాయి. పరిమితి దాటిన తర్వాత ఆర్థిక, ఆర్థికేతర సేవలపై చార్జీలను విధించనున్నాయి. ఖాతా రకం, డెబిట్ కార్డుల ఆధారంగా ఏటీఎంలో ఉచిత లావాదేవీల సంఖ్య విషయంలో మార్పు ఉండే అవకాశం ఉంది. ప్రతి నెల అనుమతించిన వాటికి మించి జరిపే లావాదేవీలపై ఖాతాదారులు చార్జీలు చెల్లించకతప్పదు. నిజానికి ఇందుకు సంబంధించి గతేడాది జూన్లోనే భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏటీఎంలో ఉచిత లావాదేవీలు పరిమితికి మించితే ఈ ఏడాది జనవరి 1 నుంచి ప్రతి లావాదేవీకి రూ. 21 చార్జ్ వసూలు చేసేందుకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. గతంలో ఈ చార్జ్ రూ. 20గా ఉండేది. ఖాతాదారులు ప్రతి నెల తమ బ్యాంకు ఏటీఎం నుంచి ఉచితంగా ఐదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి మూడు ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. నాన్ మెట్రో కేంద్రాల్లోని ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఐదు లావాదేవీలను ఉచితంగా చేసుకోవచ్చు. ఈ పరిమితి దాటితే ప్రతి లావాదేవీపైనా బాదుడు తప్పదు.
ఇక పలు బ్యాంకులు డబ్బు విత్ డ్రాపై కూడా పరిమితి విధించాయి. యాక్సిస్ బ్యాంకు మాత్రం ఏటీయంలో తమ ఖాతాదారులకు ఒక్క విత్ డ్రాకు పదివేల రూపాయల పరిమితి విధించింది. ఇదిలా ఉండగా, ఆగస్టు 1 నుంచి ఆర్థిక లావాదేవీకి రూ. 17, ఆర్థికేతర లావాదేవీకి రూ. 6 చొప్పున ఇంటర్చేంజ్ రుసుమును విధించుకునేందుకు అన్ని బ్యాంకులకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. మరిన్ని ఏటీఎం కేంద్రాలను ఏర్పాటు చేయడానికి, వాటి నిర్వహణ కోసమే బ్యాంకులు ఈ సర్వీసు చార్జీలను ఉపయోగిస్తాయి. అలాగే, అన్ని మేజర్ బ్యాంకులు డెబిట్ కార్డులపై వార్షిక ఫీజును కూడా వసూలు చేస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more