శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. బీజేపి అసలు రంగు బయట పడిందంటూ దుయ్యబట్టింది. కేంద్రంలోని విపక్షనేతలకు ఉన్న భద్రతను తొలగించి.. రెబెల్ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించడంతో వారి వెనుకనున్న అదృశ్యబలం ఎవరో దేశప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.50కోట్లకు అమ్ముడుపోయారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఏక్నాథ్ షిండే ఇంతలా డబ్బును ఇస్తున్నారన్న అరోఫణలు వస్తే మాత్రం కేంద్రంలోని ఏ మంత్రి నోరు విప్పరు. కేంద్రంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థలు కూడా కళ్లు, చెవులు అప్పగించి చూస్తున్నాయే తప్ప మరే చర్య తీసుకోవడం లేదెందుకని అని శివసేన ప్రశ్నించారు. కేంద్రం చర్యలపై స్పందించిన సామ్నా సంపాదకీయంలో బీజేపిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘‘బీజేపి అసలు రంగేంటో ఇప్పుడు బయటపడింది. శివసేనలో తిరుగుబాటు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని కాషాయ పార్టీ పైకి చెబుతోంది. కానీ, తెరవెనుక ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడణవీస్ వడోదరలో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారని అరోపించింది.
ఈ సమావేశం తరువాతే రెబల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ భద్రతను కేంద్రం కల్పించింది. రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలకు బీజేపినే కారణమని చెప్పేందుకు ఇంతకంటే సాక్ష్యం ఉంటుందా..? బీజేపీనే ఆ నటులకు(రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ) స్క్రిప్ట్ రాసి ఈ మొత్తం నాటకానికి దర్శకత్వం వహించింది’’ అని శివసేన దుయ్యబట్టింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.50కోట్లకు అమ్ముడుపోయారంటూ పార్టీ ఆరోపించింది. రెబల్ ఎమ్మెల్యేలకు డబ్బు సమకూర్చింది కూడా బీజేపీనేనని, పైకి నీతిమంతులుగా చెలమాణి అవుతూ లోలోపల దుర్నీతిని అవలంభిస్తున్నారని శివసేన నేతలు అరోపించారు.
షిండే వర్గ రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సమయంలో కన్నాడ్ శివసేన ఎమ్మెల్యే ఉదయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే వర్గం తనకు రూ.50కోట్లు ఆఫర్ చేసిందని ఆరోపించారు. ‘‘తిరుగుబాటు చేసిన శిందే శిబిరం నన్ను కూడా తమతో పాటు రమ్మని ఒత్తిడి చేసింది. పదే పదే ఫోన్లు చేసి నన్ను బలవంతపెట్టేందుకు వారు ప్రయత్నించారు. దీంతో నేను ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నా. ఆ తర్వాత కొంతమంది కారులో నా దగ్గరకు వచ్చారు. అందులో రూ.50కోట్ల డబ్బు ఉన్నట్లు చెప్పారు. కానీ నేను వారికి ఒకటే చెప్పాను. ఠాక్రే కుటుంబం, శివసేన పార్టీకి నేనెప్పుడూ విధేయుడిగానే ఉంటానన్నాను’’ అని ఉదయ్ సింగ్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more