Now Tata Nexon EV catches fire in Mumbai ముంబైలో పేలిన టాటా నెక్సాన్ ఎలక్రిక్ కారు..!

Tata nexon ev bursts in flames first ev fire for tata motors under investigation

Tata Nexon EV, Tata Nexon EV Fire, Nexon EV Catches fire, Mumbai, Tata Motors, Nexon fire, Nexon EV max, Vasai West region, Mumbai, Maharashtra, Crime

The past few months have seen a number of ev scooters going up in flames in India. But these incidents had so far been limited to two-wheelers. Now, a video of an electric car on fire has been doing rounds on social media. A Tata Nexon EV caught fire in Mumbai. Videos of the EV on fire have been circulating on the internet and Tata Motors has come out with a statement in response to this incident. The Nexon EV caught fire near the Vasai West region in Mumbai.

ITEMVIDEOS: టూ వీలర్ తరువాత కార్లకు సోకింది.. ముంబైలో పేలిన టాటా ఎలక్రిక్ కారు..!

Posted: 06/23/2022 07:35 PM IST
Tata nexon ev bursts in flames first ev fire for tata motors under investigation

ఇంధన ధరలు ఎలా పెరుగుతున్నా.. ఇప్పటికీ అటో రంగంలో పెట్రోల్, డీజిల్ వాహనాల డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదని అమ్మాకాలు ఓ వైపు స్పష్టం చేస్తూనేవున్నాయి. ఆకాశాన్ని అంటుతున్న ధరల నేపథ్యంలోనూ వాటి వైపే వాహన యజమానులు మొగ్గుతున్నారంటే.. విద్యుత్ వాహనాలపై ఇప్పటివరకు వారిలో పూర్తి నమ్మకం కలగకపోవడమే. ఇక దీనికి తోడు విద్యుత్ చార్జింగ్ ష్టేషన్లు కూడా అందుబాటులోకి రాకపోవడమే. గత రెండు మూడు నెలులుగా పలువురి మరణాలకు, ఆస్తుల ధగ్ధానికి కారణమైన ఈవీ వాహనాలపై ప్రజల్లో తెలియని భయం నెలకొని ఉంది.

అప్రమత్తంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగవు అని అనుకుని కొందరు ధైర్యం చేసి విద్యుత్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటుంది. గత కొన్ని నెలలుగా జరిగిన అన్ని ఘటనలు కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ ఈవీ కార్ల విషయంలో మాత్రం ఎలాంటి భయాలు అవసరం లేదని అంటున్నారా.? అయితే అక్కడికే వస్తున్నాం.. తాజాగా ముంబై నగరంలో టాటా నెక్సాన్ ఈవీ కారు అగ్ని ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి కారులో ఉన్నట్టుండి మంటలు లేచాయి. మంటలను ఆర్పేసరికే అది బాగా దెబ్బతిన్నది.

ఓ హోటల్ ఎదుట ప్కార్ చేసిన కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది. టాటా గ్రూపు కంపెనీ టాటా మోటార్స్ కు చెందిన నెక్సాన్ ఈవీ కారు ప్రమాదానికి గురికావడం గమనార్హం. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ముందుస్థానంలో నిలిచిన ఈవీ కార్లలో ఇది ఒకటి. కాగా, ఈ కారే ముంబైలోని వెస్ట్ వాసాయ్ ప్రాంతంలో ఓ రెస్టారెంట్ ముందు నిలిపగా, కారులోంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి కారణం ఏంటన్నది తెలియలేదు.


అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. అయితే కారు రన్నింగ్ లో ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు జరిగితే తప్పించుకునే మార్గం ఉండదని.. కారులోని వ్యక్తుల ప్రాణాలకు కూడా ప్రమాదం పోంచి వుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నెక్సాన్ ఈవీ ప్రమాదంపై వెనువెంటనే స్పందించిన టాటా మోటార్స్ సంస్థ.. కారు ప్రమాదంపై తమ సంస్థాగత విచారణ నిర్వహిస్తామని టాటా మోటార్స్ ప్రకటించింది. ప్రమాదానికి దారితీసిన అంశాలను గుర్తించేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నామని, పూర్తయిన తర్వాత ప్రకటన చేస్తామని తెలిపింది.

గతంలో ఓలా, ప్యూర్ఈవీ సహా పలు కంపెనీలు ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగాయి. బ్యాటరీ నాణ్యత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టాటా నెక్సాన్ ఈవీ ప్రమాదం వీడియోను ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఈవీ ప్రమాదాలు అసాధారణమేమీ కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవేనని పేర్కొన్నారు. ఇంటర్నల్ కంబస్టన్ ఇంజన్ వాహనాలతో పోలిస్తే ఈవీలే సురక్షితమైనవని ప్రకటించారు. ‘‘ఈవీ అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. అన్ని అంతర్జాతీయ ఉత్పత్తుల్లోనూ ఇవి జరుగుతాయి. కానీ, ఈవీల్లో అగ్ని ప్రమాదాలు అన్నవి ఐసీఈ అగ్ని ప్రమాదాల కంటే తక్కువ’’ అని ట్వీట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tata nexon ev  nexon  tata  nexon ev  Mumbai  Tata Motors  Nexon fire  Nexon EV max  ola electric  Mumbai  Maharashtra  Crime  

Other Articles