సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అందులోకి వెళ్ళాలని ఎంతో మంది ఆశపడుతుంటారు. కానీ అందరికీ అవకాశాలు రావు. ఛాన్స్లు వచ్చినా కొందరు నిలదొక్కుకోలేరు. అయితే సినీరంగంలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్తో పాటు అదృష్టం కూడా కలిసిరావాలని అంటుంటారు. ముఖ్యంగా నటీమణులు సినిమాల్లో నిలదొక్కుకోవాలంటే ఈ రెండింటింతో పాటుగా అందం కూడా ఉండాలి. అందుకే గ్లామర్గా కనిపించడానికి కొంతమంది సర్జరీలు కూడా చేయించుకుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది తారలు అందంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకున్నారు.
అయితే సర్జరీలు కూడా కొన్ని సార్లు బెడిసి కొడుతుంటాయి. ఎంతలా ఉంటే ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. ప్రస్తుతం ఇలాంటి బాధనే అనుభవిస్తోంది నటి స్వాతి సతిష్. ‘ఎఫ్ఐఆర్’, ‘6 టూ 6’ వంటి తదితర చిత్రాలతో స్వాతి కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో స్వాతి కెనాల్ థెరపీ చేయించుకుంది. తీరా ఆ ఆపరేషన్ ఫెయిల్ అవడంతో ముఖం అంతా వాచిపోయింది. ఆ వాపు రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినా 3 వారాలకు కూడా తగ్గలేదు. అంతేకాకుండా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు స్వాతి చెప్పుకొచ్చింది.
ముఖం ఉబ్బడంతో ఎవరు గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని, ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లడం కష్టంగా ఉందని తెలిపింది. ముఖంపై వాపు ఉండటంతో తనకు వచ్చిన సినిమా అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాగా ఆ హాస్పిటల్లో డెంటిస్ట్ తనకు తప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాడని స్వాతి ఆరోపిస్తోంది. సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చారని.. చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఈ విషయం తెలిసినట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు ఆస్పత్రిపై, డాక్టర్పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more