చేతివాటం ప్రదర్శించే కళ ఉన్నవారు కొందరున్నారు. అయితే వీరిని కూడా మించిన స్థాయిలో నాజుక్కా హస్తలాఘవం ప్రదర్శించిన ఓ సర్కిల్ ఇన్స్ పెక్టరుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారి దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. ఇంతకీ చేతివాటం ప్రదర్శించే వారు పిక్ పాకెటర్స్. మరోలా చెప్పాలంటే దొంగలు. అయితే వీరిని మించిన స్థాయిలో తన హస్తలాఘవాన్ని ప్రదర్శించిన వ్యక్తి ఎవరో కాదండీ ఏకంగా పోలీసు. అది సర్వసాధారణ పోలీసు హోంగార్డో.. కానిస్టేబుల్, హెడ్డో కూడా కాదండీ.. ఏకంగా తన స్టేషన్లోని ఏఎస్ఐలు, ఎస్ఐలకు కూడా ఆయన పెద్ద. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ స్టేషనే ఆయనే బాస్.
ఇలాంటి వ్యక్తి ఏకంగా ఓ వ్యక్తికి చెందిన డబ్బును తన డబ్బుగా మార్చేసి.. స్వాహా అనిపించాడు. ఇంతకీ ఎవరాయన.? అంటే అయనే ఆ స్టేషన్ కు సర్కిల్ ఇన్స్ పెక్టర్. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ఉండేందుకు.. తన జిల్లాలోని పోలీసులు అందరికీ ఓ గుణపాఠాం చెప్పేందుకు ఏకంగా కర్నూలు జిల్లా ఎస్పీ చక్కటి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక సిఐ పరారీలో ఉన్నారు. అదెలా అంటే డబ్బులు నోక్కేసిన తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ కంబగిరి రాముడుపై.. అదే స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విధంగా తాను సిఐగా పనిచేసినే చోటే నిందితుడిగా మారడంతో ఆయన పరారీలో వున్నారు.
ఇక ఈ విషయం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 19న పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ అధికారులు హైదరాబాద్ నుంచి తమిళనాడు వెళ్తున్న బస్సును ఆపి తనిఖీ చేశారు. తమిళనాడుకు చెందిన సతీశ్ బాలకృష్ణన్ అనే ప్రయాణికుడి వద్ద 75 లక్షల రూపాయలు దొరికాయి. సెబ్ అధికారులు డబ్బుతోపాటు అతన్ని కర్నూలు తాలూకా అర్బన్ పోలీసు స్టేషన్ కు అప్పగించారు. డబ్బుకు సంబంధించిన పత్రాలు అప్పుడు తనవద్ద లేకపోవడంతో.. సతీష్ డబ్బు తనదేనని నిరూపించుకునే అధారాలతో వచ్చి సెబ్ అధికారులకు చూపించాడు. దీంతో వారు డబ్బును రిలీజ్ చేయాలని లేఖను జారీ చేశారు.
దీంతో సదరు లేఖను కర్నూలు తాలుకా పోలిస్ స్టేషన్లోని సిఐ కంబగిరి రాముడుకు చూపించగా, ఆయన మొత్తం సొమ్ము తిరిగి ఇవ్వకుండా.. జిల్లా ఎస్పీకి ఇవ్వాలంటూ 15 లక్షల రూపాయలు బలవంతంగా తీసుకున్నాడు. దీంతో బాధితుడు నేరుగా వెళ్లి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని కలిశారు. తనకు జరిగిన విషయాన్ని చెప్పారు. తనకు తన రూ.15 లక్షలు ఇప్పించాలని కోరాడు. దీంతో తాలుకా పోలీస్ స్టేషన్లో సీఐపై కేసు నమోదు చేసి.. కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించారు. బాధితుడు సతీశ్ బాలకృష్ణన్ ఫిర్యాదు మేరకు సీఐతోపాటు ముగ్గురు మధ్యవర్తులపైనా కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ పరారీలో ఉన్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more