రాష్ట్రంలో చలిపులి పంజా విసురుతున్నది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోని 29 జిల్లాలో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో.. చలి తీవ్రతకు ప్రజలు వణుకుతున్నారు. ఖమ్మంలో11, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవగా.. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో 4.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు దట్టంగా పొగమంచు కురుస్తున్నది. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడకపోవడంతో ఎదుట ఏం ఉన్నదో తెలియని పరిస్థితి ఏర్పడింది. మంచుదుప్పటి కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. లైట్లు వేసుకొని వాహనాలు నడుపాల్సి వస్తున్నది. ఉత్తరాది నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతోనే తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
గత 20 సంవత్సరాల్లో ఇంత చలి తీవ్ర ఎప్పుడూ లేదని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి సంక్రాంతి పండుగ తర్వాత చలి క్రమంగా తగ్గుతూ వస్తున్నది.. కానీ, ఈ ఏడాది జనవరి చివరికి వస్తున్నా తీవ్రత తగ్గడం లేదు. ఆదివారం ఉదయం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. అలాగే మరో మూడు రోజులు రాష్ట్రంలో చలితీవ్రత ఉంటుందని తెలిపింది. ఉత్తరాధి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సైతం తక్కువగానే నమోదవుతున్నాయి.
మధ్యాహ్నం 12 గంటల వరకు చల్లగానే ఉంటుంది. సాయంత్రం 3 గంటల తర్వాత చలి ప్రారంభం అవుతున్నది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోతుండడంతో చలి పెరుగిందని, ప్రజలు జాగ్రతలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే అత్యంత ఎక్కువగా నారాయణపేట జిల్లా మాగనూర్లో 33.9 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు తగ్గముఖం పడుతున్నాయి. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో మళ్లీ చలి గాలులు విజృంభిస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ ఏడాది ఇదే అత్యల్పమని పరిశోధన స్థానం ఇన్చార్జి చెప్పారు. జి.మాడుగులలో 5.58, జి.కె.వీధిలో 5.72, అరకులోయలో 6.45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9 డిగ్రీలు, అరకులోయ కేంద్రం కాఫీబోర్డు వద్ద 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురవడంతో ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీలోని అరకులోయ, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో సూర్యోదయం కాలేదు. మంచు తీవ్రత చలిగాలులతో వ్యవసాయ పనులు, వారపుసంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచుతో పాడేరు, చింతపల్లి, అనంతగిరి ఘాట్ రోడ్లలో వాహన చోదకులంతా లైట్లు వేసుకునే వాహనాలు నడిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more