తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించినా.. కేసులు మాత్రం తీవ్రస్థాయిలోనే వున్నాయన్నది కాదనలేని వాస్తవమని వార్తులు వినిపిస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు సంఖ్యను కేంద్ర కుటుంబఆరోగ్యశాఖ చూపిస్తున్న లెక్కలకు.. వాస్తవ పరిస్థితులకు చాలా తేడా వుంది. అయితే సాధారణ జలుబు, దగ్గులతో కూడిన ఫ్లూగానే దీనిని దేశ ప్రజలు భావిస్తూ.. కొందరు ఆసుపత్రులను ఆశ్రయిస్తుండగా, మరికొందిరు మాత్రం ఇళ్లవద్ద సంప్రదాయ వైద్యానికి పరిమితం అవుతున్నారు. దీంతో దేశంలోనే ఒమిక్రాన్ కేసులు అత్యల్ప సంక్యలోనే నమోదు అవుతున్నాయని కేంద్ర గణంకాలు తెలుపుతున్నాయి.
ఇప్పటికే కొందరు వైద్యులు తమవద్దకు వస్తున్న కేసుల్లో దాదాపుగా 90శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వేనని, అయితే కేవలం 10 శాతం మాత్రమే డెల్టా వేరియంట్ కేసులని స్పష్టం చేస్తున్నారు. అయితే మరికొందరిలో మాత్రం కరోనా సోకినా వారిలో లక్షణాలు ఏమాత్రం కనిపించడం లేదు. అనుమానంతో తీరా పరీక్షా కేంద్రానికి వెళ్లి నమూనా ఇచ్చిన తర్వాత నెగెటివ్ అని ఫలితం చెబుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి చాలా మందికి ఎదురవుతోంది. దగ్గు, జలుబు, ఒంటి నొప్పుల లక్షణాలతో ఎన్నడూ లేనట్టు ఇబ్బందిగా అనిపించిన వారికి కూడా పరీక్షల్లో పాజిటివ్ రావడం లేదు.
కొన్ని రకాల పరీక్షా విధానాలు, సరైన విధానంలో పరీక్ష చేయకపోవడం, ముక్కు నుంచి ద్రవాన్ని సరిగ్గా సేకరించకపోవడం, రవాణా సమయంలో శాంపిళ్లను సరిగా నిల్వ చేయకపోవడం ఫలితాలను మారుస్తుందని పీడీ హిందుజా హాస్పిటల్ కు చెందిన వైద్యుడు భరేష్ దాదియా చెప్పారు. ‘‘కొన్ని ఒమిక్రాన్ వేరియంట్లు ఆర్టీపీసీఆర్, ముఖ్యంగా రాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లో నెగెటివ్ గానే రీడ్ అవుతున్నాయి. ర్యాపిడ్ యాంటీజెన్ సెన్సిటివిటీ 50 శాతమే. వైరల్ లోడ్ కూడా తక్కువగా ఉంటోంది. సీటీ వ్యాల్యూ 35 కంటే ఎక్కువ ఉంటే దాన్ని నెగెటివ్ గా పరిగణిస్తారు. వైరల్ లోడ్ తక్కువ ఉన్న వారిలో సీటీ వ్యాల్యూ35 కంటే ఎక్కువ ఉంటోంది. దాంతో ఫలితం నెగెటివ్ అని చూపిస్తోంది’’ అని దాదియా వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more