అక్రమంగా రూపాయిని ఆర్జించినా అది అవినీతే అని పెద్దలు చెప్పిన మాటలకు నూతన బాష్యం చెప్పారు ఓ పార్లమెంటు సభ్యుడు. బీజేపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్య వహిస్తున్న ఈ ఎంపీ ఓ గీటు గీసి.. అంతకుమించి.. ఆ లోపల అని అవినీతికి హద్దులు గీశారు. ఆయన గీసిన గీటురాయి ప్రకారం రూ.15 లక్షలకు మించితేనే అవినీతికి పాల్పడినట్లని.. ఆ లోపు ఎంత తిన్నా అది అవినీతి కిందకు రానేరాదు అని చెప్పేశారు. ఇంతకీ అవనీతి హద్దులు గీసిన లోక్ సభ సభ్యుడు ఎవరేనేగా.? బీజేపి ఎంపీ జనార్థన్ మిశ్రా. ఎవరైనా సరే అతన గీతను దాటి అవినీతికి పాల్పడితే తనకు పిర్యాదు చేయాలని సూచించారు.
15లక్షల పైన అవినీతికి పాల్పడినట్లు అరోపణలు వచ్చిన పక్షంలో ఆయా సర్పంచులపై తనకు సంప్రదించాలని ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. మధ్యప్రదేశ్ లోని రేవాలో జరిగిన ఓ మీడియా కార్యక్రమానికి హాజరైన ఎంపీ.. ఈ వ్యాఖ్యలు చేశారు. సర్పంచులుపై ప్రజలు అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు అతను రూ.15 లక్షల వరకు అవినీతి చేసి ఉంటే తన వద్దకు రావద్దని, రూ.15లక్షలకు పైబడితేనే తన వద్దకు రావాలంటూ పేర్కొనడంతో ఈ కార్యక్రమానికి హాజరైన వారు కంగుతిన్నారు. సర్పంచ్లు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రజలు పెద్ద ఎత్తున తన వద్దకు వస్తున్నారని తెలిపారు.
అయితే ఎ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.7లక్షలు ఖర్చు చేసిన సర్పంచులు ఆ డబ్బును వసూళ్లకు అవినీతికి పాల్పడుతున్నారని, అలాగే రానున్న ఎన్నికల ఖర్చుగా మరో ఏడు లక్షలు.. ఇక పెరుగుతున్న ధరలకు మరో లక్ష అంతా కలపి రూ.15 లక్షల వెసలుబాటు కల్పించారు ఈ ఎంపీ. దీంతో ఎంపీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రతిపక్షాలు ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పబట్టాయి. మీడియాకు నిర్వహించిన ‘ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంలో మీడియా పాత్ర’ అనే సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more