పంజాబ్ అసెంబ్లీకి మరికొన్ని వారాల్లో ఎన్నికలకు వెళ్లనుంది. ఈ క్రమంలో అక్కడ రాజకీయం ఇప్పటికే వేడెక్కింది. ఓ వైపు బీజేపి.. మరోవైపు అకాళీదళ్, ఇంకో వైపు కెప్టెన్ అమరీందర్ సింగ్. వీరితో పోటీ పడుతూ అప్ కూడా రంగంలో దిగి ఇప్పటికే ప్రచార పర్వాలను నిర్వహిస్తున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఈ సారి కూడా పంజాబ్ కోటపై విజయబావుటా ఎగురవేసేది తామేనంటూ భీష్మించుకుని కూర్చుంది. ఈ క్రమంలో బలమైన పార్టీలను దెబ్బకొట్టాలని పథక రచనలు కూడా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రజల ముక్కుపిండి పన్నుల రూపంలో వసూళ్లు చేసిన డబ్బును అప్పనంగా నేతలకు అందించి.. తమ పార్టీలోకి వచ్చేలా ఆపర్ల వర్షం కూడా కురిపించడం కామన్.
రైతుల అంశాల్లో బీజేపితో విభేధించిన అకాళీదళ్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో ఒంటిరిగా తనకు అనుకున్నంత బలం లేకపోవడంతో బీజేపి పంజాబ్ ఎన్నికలలో ఎలా పావులు కదపాలో కూడా తెలియని అయోమయస్థితిలోకి జారుకుంది. ఈ క్రమంలో పంజాబ్ కాంగ్రెస్ కు అన్నీ తానై వ్యవహరించిన ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ పదవీచ్యుతిడిని చేసిన వెంటనే పార్టీకి రాంరాం పలికిన ఆయన కొత్త పార్టీని పెట్టి.. బీజేపికితో జతకలసి పోరాడుతున్న విషయం కూడా తెలిసిందే.
అయితే అంచనాలు ముందే తెలుసుకన్న బీజేపి.. అమరీందర్ తమతో జతకట్టినా.. లాభం ఉండకపోవచ్చునని అంచనా వేసింది. దీంతో ఇతర పార్టీలలో పలుకుబడి కలిగిన నేతలను తమ పార్టీలోకి లాగేందుకు యత్నిస్తున్నారు. అదేనండీ అపరేషన్ కమలాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్ర ప్రజలపై ఎన్నికల హామీలను కురిపిస్తున్నారు. తమ పార్టీ ఎన్నికలలో గెలిస్తే విద్యుత్ సహా పలు విషయాల్లో రాయితీలను ప్రకటిస్తున్నారు. తాను మాటల మనిషిని కాదని, ఢి్లిలో చేసిన చూపించిన తరహాలోనే ఇక్కడా కూడా అమలు చేసి చూపిస్తానని ఉద్ఘాటిస్తున్నారు.
దీంతో ఆ పార్టీని బలహీనం చేయడానికి బీజేపి వేసిన ఎత్తుగడ పారలేదు. ఆప్ పార్టీకి మూలస్థంబంగా వున్న పంజాబ్ అప్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు భగవంత్ మాన్ ను ప్రలోభాలకు గురిచేసిన బీజేపి.. ఆయనను తమ పార్టీలోకి మళ్లించుకోగలిగితే.. పంజాబ్ లో అమరీందర్ తో కలసి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చునని కూడా పథకరచన చేసింది. కానీ తానొకటి తలిస్తే.. భగవంతుడు మరోటి తలుస్తాడన్న నానుడిలా మారింది బీజేపి పరిస్థితి. ఇక ముక్కుసూటి మనత్తత్వం గల భగవంత్ మాన్ తనను బీజేపిలోకి లాగేందుకు ప్రయత్నాలు కొనసాగాయని చేసిన అరోపణలు పంజాబ్ లో బీజేపిని నడివీధిలో నిలబెట్టింది.
ఎంపీ భగవంత్ మాన్ బీజేపీపై చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నాలుగు రోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పిన ఆయన.. ఆప్ను వదిలేసి బీజేపీలో చేరితే భారీగా నగదుతోపాటు కేంద్రమంత్రి పదవి కూడా ఇస్తామని చెబుతూ ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ‘‘మాన్ సాబ్, బీజేపీలో చేరడానికి ఎంత తీసుకుంటారు? మీకు డబ్బు కావాలా?’’ అని ఆయన నేరుగా అడిగేశారని భగవంత్ మాన్ విలేకరులకు తెలిపారు. ఆ నేత ఆఫర్ను తాను తిరస్కరించినట్టు చెప్పారు. తానో మిషన్పై రాజకీయాల్లోకి వచ్చానని, తనను డబ్బుతో కొనలేరని తేల్చి చెప్పారు. తాను కమిషన్ల కోసం రాజకీయాల్లోకి రాలేదని ఎంపీ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more