దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ప్రధానమైంది సికింద్రాబాద్ జంక్షన్. ఈ స్టేషన్ మీదుగా నిత్యం వందలాది రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్ష మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్ను వినియోగించుకుంటారు. రద్దీ తగ్గట్టుగా స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని, పీపీపీ మోడ్లో పనులు చేపట్టబోతున్నట్టు ఇన్నాళ్లు ప్రకటిస్తూ వస్తోన్న రైల్వేశాఖ.. ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సామాన్యుల నడ్డీ విరిచేలా పార్కింగ్ ఫీజుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తోంది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ఇరువైపులా పార్కింగ్ ప్లేస్ లు ఉన్నాయి. ఇక్కడ టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను ప్రయాణికులు నిలిపి ఉంచుతున్నారు. దక్షిణ మధ్య తాజా నిబంధనల ప్రకారం ఇక్కడ రెండు గంటల పాటు టూ వీలర్ నిలిపి ఉంచితే రూ.15, ఫోర్ వీలర్ అయితే రూ.50 వంతున పార్కింగ్ ఛార్జీగా విధించింది. ఎవరైనా రెండు గంటలకు మించి పార్కింగ్ ప్లేస్లో వాహనం నిలిచి ఉంచినట్టయితే గుండె గుబిల్లుమనేలా జరిమానాలు విధిస్తోంది రైల్వేశాఖ. రెండు గంటల తర్వాత మొదటి ఎనిమిది నిమిషాలకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ లేదు. కానీ ఆ తర్వాత గడిచే ఒక్కో నిమిషానికి ఒక్కొ రేటు విధించింది. అవి చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.
ఆ ధరలు ఇలా వున్నాయి:-
* తొలి రెండు గంటల తర్వాత 8 నుంచి 15 నిమిషాల ఆలస్యానికి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.100
* తొలి రెండు గంటల తర్వాత 16 నుంచి 30 నిమిషాల ఆలస్యానికి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.200
* తొలి రెండు గంటల తర్వాత 30 నిమిషాలు దాటి ఆలస్యమయితే ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జ్ రూ.500
ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ఈ ఎక్స్ట్రా పార్కింగ్ ఛార్జీలు శరాఘాతంగా మారాయి. పండగ వేళ స్టేషన్కి వెళ్లి ఓవర్ స్టే పార్కింగ్ ఛార్జీల కాటుకు గురైన ఎందరో సోషల్ మీడియా వేదికగా రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నవంబర్ 4న.. దీపావళి పండుగ నేపథ్యంలో తన ఇంటికి వస్తున్న బంధువులను పిక్ అప్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చిన మాజీ అర్మీ బ్రిగేడియర్ అధికారి ఏకే జైరథ్ కు ఈ సెగ తగిలింది. ఆయన కేవలం 31 నిమిషాల పాటు కారును పార్కు చేశారు.
దీంతో కారును 31 నిమిషాల పాటు పార్క్ చేసినందుకు అక్కడి అధికారులు ఆయనకు ఏకంగా రూ.500 పార్కింగ్ ఫీజును విధించారు. దీంతో ఆయన తన బాధను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ నెల 9న షేర్ చేసుకున్నారు. దీనిని కొందరు నెట్ జనులు రాష్ట్ర మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన నేరుగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు విషయాన్ని చేరవేశారు. ఈ తరహా ధరలపై కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరహా ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కోన్నారు. మంత్రి నుంచి ట్వీట్ అందుకున్న వెంటనే దానిని సంబంధిత అధికారులకు చేరవేసిన కేంద్రమంత్రి.. తక్షణం చర్యలు తీసుకోవాలని అదేశించారు.
Privatisation Shows its Colour.
— Brigadier A K Jairath, Retd (@KWecare) November 9, 2021
Parking a car for 31 minutes at a railway station now costs Rs.500 as parking charges.
Whose Vikas? pic.twitter.com/EyFNS4rdPl
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more