పాకిస్థాన్కు భారత్ గట్టిగా బదులిచ్చింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని అనడం పట్ల ఐరాసలోని భారత ప్రతినిధి స్నేహ దూబే అభ్యంతరాలు తెలిపారు. జమ్మూకశ్మీర్, లడఖ్ భారత్లో అంతర్భాగమని ఆమె చెప్పారు. వాటిని భారత్ నుంచి ఎవరూ వేరు చేయలేరని స్నేహ చెప్పారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ కేంద్ర బిందువుగా మారుతోందని, ఉగ్రవాదులను పాక్ పెంచి పోషిస్తున్న విషయాన్ని ప్రపంచ దేశాలు బహిరంగంగానే అంగీకరిస్తున్నాయని గుర్తు చేశారు.
ఐక్యరాజ్యసమితి వాంటెడ్ జాబితాలో ఉన్న ఉగ్రవాదుల్లో ఎక్కువ శాతం మంది పాకిస్థాన్లో ఉన్న విషయాన్ని గ్రహించాలని ఆమె అన్నారు. ఇప్పటికే పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంలా వుందన్ని విమర్శలు ప్రపంచ దేశాల్లో వినిపిస్తున్నాయని అమె అన్నారు. ఇలాంటి విమర్శలను వింటూకూడా మీరు ఉగ్రవాదులకు ఎలా మద్దుతునిస్తున్నారని అమె ప్రశ్నించారు, ఒసామా బిన్ లాడెన్కు పాకిస్థానే ఆశ్రయం ఇచ్చిందని, అంతేగాక, ఇప్పటికి కూడా ఆ ఉగ్రవాదిని పాక్ ఓ అమరుడిగా గుర్తిస్తోందని ఆమె అన్నారు.
పాక్ అవలంబిస్తున్న విధానాల వల్లే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని ఆమె విమర్శించారు. కాగా, స్నేహ దూబే 2012 బ్యాచ్కు చెందిన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ప్రస్తుతం న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరుగుతోన్న విషయం తెలిసిందే. పుణెలోని ఫెర్గూసన్ కాలేజీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఢిల్లీలోని జవర్లాల్ నెహ్రూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి స్నేహ దూబే ఎంఫిల్ పూర్తి చేశారు. ఇమ్రాన్ ఖాన్కు ఆమె దీటుగా సమాధానం ఇవ్వడం పట్ల భారత్ ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది. మరోవైపు, ఈ రోజు ఐరాస భద్రతా మండలి సమావేశంలో భారత ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more