ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించిన ఒక నిందితుడు ఐదు నెలలుగా జుడిషియల్ రిమాండ్ లో వున్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇటీవల ఆ నిందితుడు న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశాడు. అతని బెయిలు పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం అతనికి దిమ్మదిరిగే కండీషన్ ను పెట్టింది. న్యాయస్థానం పెట్టిన షరుతుకు సదరు నిందితుడు అంగీకరించడంతో అతనికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే వృత్తి రిత్యా సదరు నిందితుడు గ్రామాస్థుల బట్టలు ఉతికే ధోబి పని చేస్తాడని తెలిసే న్యాయస్థానం ఈ కండీషన్ పెట్టింది.
ఇంతకీ న్యాయస్థానం అత్యాచారయత్నం చేసిన నిందితుడికి ఏం షరతు విధించిందో తెలుసా.. నిందితుడు ఆరు నెలల పాటు గ్రామంలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతకడంతోపాటు ఇస్త్రీ చేసి ఇవ్వాలని చెప్పింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ఆ గ్రామంలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీహార్ లోని మజోర్ గ్రామానికి చెందిన 20 ఏండ్ల లాలన్ కుమార్ బట్టలు ఉతుకుతూ జీవనోపాధి పొందేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహిళపై లైంగిక దాడి యత్నం కేసులో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కాగా, బెయిల్ కోసం కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై కొర్టు విచారణ జరిపింది. దీని కోసం వింత షరతు విధించింది.
ఆరు నెలలపాటు గ్రామంలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతికి, ఇస్త్రీ చేసి ఇవ్వాలని.. అందుకయ్యే ఖర్చును కూడా భరించాలని పేర్కొంది. కోర్టు తీర్పుపై గ్రామంలోని సుమారు 2 వేల మంది మహిళలు హర్షం వ్యక్తం చేసినట్లు గ్రామ సర్పంచ్ నసీమా ఖాటూన్ తెలిపారు. ‘ఈ తీర్పు చారిత్రాత్మకమైంది. మహిళల గౌరవాన్ని పెంపొందిస్తుంది. మహిళల గౌరవాన్ని కాపాడటానికి సహాయపడుతుంది’ అని ఆమె అన్నారు. మహిళలపై జరిగే నేరాల గురించి సమాజంలో చర్చించడంపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆ గ్రామంలో మహిళలు తెలిపారు. ‘ఇది ఒక ముందడుగు. సమాజానికి సందేశాన్ని పంపే విభిన్నమైన శిక్ష’ అని అంజుమ్ పెర్వీన్ అనే మహిళ వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more