కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పనుంది. గత కొన్ని నెలలుగా ఏడుకొండలు ఎక్కినా శ్రీవారి దర్శనభాగ్యం కలగని భక్తులకు ఇకపై కాసింత ఊరట లభించనుంది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు సర్వదర్శనాలు ఇటీవలే తిరిగి ప్రారంభించిన టీటీడీ.. ఇకపై ప్రత్యేక దర్శనంతో పాటు సర్వదర్శన టోక్లన్లను కూడా ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఆన్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు విక్రయించేందుకు సిద్ధమవుతోంది.
త్వరలో ఆన్ లైన్ లోనూ సర్వదర్శనం టోకెన్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు టీటీడీ పాలక మండలి ప్రకటించింది. దీనిపై చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. ఎక్కువ మందికి శ్రీవారి సర్వదర్శనం కల్పించాలని కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వారంలోపు సర్వదర్శనం టోకెన్లను ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శన టోకెన్స్ విడుదల చేస్తామన్నారు. టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నామని.. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆన్ లైన్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు టీటీడీ తెలిపింది.
సెప్టెంబర్ 8 ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది టీటీడీ. కరోనా నిబంధనలు అనుసరిస్తూ రోజుకు 2 వేల టోకన్లు మాత్రమే జారీ చేస్తున్న టీటీడీ.. క్రమంగా స్వామివారి భక్తులందరికీ సర్వదర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో భక్తుల ఆరోగ్య దృష్ట్యా ఉంచుకుని తిరుమలలో సర్వదర్శన టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. కేవలం ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను పరిమిత సంఖ్యలో ఇప్పటి వరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ విషయంలో భక్తులు, హిందూ ధార్మిక సంఘాల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more