సినీనటుడు దివంగత హరికృష్ణ 65వ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా ఆయనను గుర్తుచేసుకుని ఆయనకు నివాళులు అర్పిరస్తున్నారు. నందమూరి తారకరామారావు నట, రాజకీయ వారసుడు హరికృష్ణ అనేక మంది మనసులు గెలుచుకున్నారు. తెలుగు చిత్రసీమలో తొలి నటవారసునిగా నిలిచిన నందమూరి హరికృష్ణ ‘శ్రీకృష్ణావతారం’లో నటించి అలరించారు. నటుడిగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వైవిధ్యమైన పాత్రలు పోషించిన హరికృష్ణ రాజకీయాలలోను సత్తా చాటారు.
తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ మరణానంతరం పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపోందారు. 'అటు సినీరంగంలోనూ రాణించారు. సీతయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులలో ఎవరి మాట వినడు సీతయ్య అంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఆయన తనయులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు తమ తండ్రిని స్మరించుకుని ఆయనకు ఘననివాళులు అర్పించారు. 'ఈ అస్థిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే' అంటూ ఆయన కుమారులు నందమూరి కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
మీ 65వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ...Miss You Nanna! pic.twitter.com/MJwwAz7wLk
— Jr NTR (@tarak9999) September 2, 2021
నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. అందరికీ ఆత్మీయుడిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన హరికృష్ణ జ్ఞాపకాలను, పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవను ఈ సందర్భంగా స్మరించుకుందాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. 'కొందరు మన మధ్య లేకపోయినా వారితో మనకు ఉన్న అనుబంధం వారిని సజీవంగా మన కళ్ల ముందు ఉంచుతుంది. నా విషయంలో హరి మావయ్య కూడా అంతే. ఆయన జయంతి సందర్భంగా హరి మావయ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను' అని టీడీపీ నేత నారా లోకేశ్ పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more