ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దోంగలు సవాల్ విసరుతున్నారు. పోలిస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో వున్న ఏటీయం కేంద్రంలోకి చోరబడి రెండు ఏటీయంలలోని డబ్బును అపహరించుకుపోయారు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని నెహ్రూనగర్ లో దొంగలు చెలరేగిపోయారు. ఓ ఏటీఎం కేంద్రంలోకి వున్న రెండు ఏటీయంలలో వున్న రూ. 65 లక్షలను దోచుకెళ్లారు. డోన్ పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. నెహ్రూనగర్ ప్రధాన రహదారిపై ఉన్న స్టేట్ బ్యాంక్ ఏటీఎం సెంటర్ లోకి చొరబడిన దొంగలు గ్యాస్ కట్టర్, గడ్డపారతో రెండు ఏటీఎంలను బద్దలుకొట్టి వాటిలోంచి డబ్బును దొచుకుపోయారు.
అయితే ఏటీయం కేంద్రంలోకి వెళ్లే ముందుగానే అక్కడి సిసిటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన అనంతరం వాటిలోని డబ్బును దోచుకున్నారు. ఏటీఎంలు ధ్వంసమై ఉండడాన్ని నిన్న గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బ్యాంకు అధికారులు తెల్లవారుజామున 2.56 గంటల సమయంలో దోపిడీ జరిగినట్టు గుర్తించారు. శని, ఆదివారాలు సెలవు దినాలు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో బ్యాంకు అధికారులు రూ. 85 లక్షలు నింపి పెట్టారు. ఈ సొమ్ములో రూ. 65,61,900 చోరీకి గురైనట్టు గుర్తించారు.
ఇక చోరీ జరిగిన తీరును బట్టి అనుభవం ఉన్న దొంగలే ఈ దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఏటీఎం బయట ఉన్న సీసీటీవీని పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు.. లోపలున్న కెమెరాను పక్కకు తిప్పేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ దాడితో పోలీసులకు దోంగలు సవాల్ విసిరారని, అత్యంత చేరువలో పోలిస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయం వున్నా.. వారు ఏమాత్రం జంకకుండా తమ పనిని పూర్తి చేసుకుపోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more