సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా వుండే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తనకు నచ్చిన వీడియోలను తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటారు. సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తన ఫాలోవర్స్ నుంచి ఎదరయ్యూ ప్రశ్నలకు కూడా ఆయన సమాధానాలు ఇస్తారు. అలాంటి వాప్యారదిగ్గజం ఆనంద్ మహీంద్రా క్రీడాలలో నైపుణ్యం ప్రదర్శించిన వారితో పాటు విభిన్నంగా అలోచించి.. అందరి మనన్నలను పొందిన పలువురికి కానుకలతో పాటు తన సంస్థలో ఉద్యోగం కూడా కల్పించారు.
ఇటీవల టోక్యో ఒలింపిక్స్లో బెల్లం విసిరి బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు త్వరలో రిలీజ్ అయ్యే ఎక్స్యూవీ 700 ఎస్యూవీ వెహికిల్ ను గిఫ్ట్గా ఇవ్వండి సార్.. అంటూ ఓ నెటిజన్ సూచించడమే ఆలస్యం అన్నట్లు.. అయ్యో.. అంతకన్నా భాగ్యమా? అని బదులిచ్చారు ఆనంద్ మహీంద్రా. అంతటితో ఆగకుండా నీరజ్ చోప్రాకు గిఫ్ట్ ఇవ్వడం నా అదృష్టం. వెంటనే ఒక ఎక్స్యూవీ 700 వెహికిల్ ను నీరజ్ కోసం సిద్ధంగా ఉంచండి.. అంటూ తన కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ ను కూడా ఆ పోస్ట్లో టాగ్ చేశారు ఆనంద్.
తాజాగా.. కూరగాయలు విక్రేతైన ఓ మహిళ.. తన వద్దకు వచ్చిన మన జాతీయ పక్షి అదేనండీ.. నెమలికి ఆహారం తినిపిస్తున్న వీడియోను ఆనంద్ మహింద్రా షేర్ చేశారు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న మహిళ వద్దకు.. ఓ నెమలి వచ్చింది. దానిని చూసిన అమె తన వద్దనున్న గింజలను ఓ చెత్తే ఎరుతూ మరో చెత్తే దానికి పెట్టింది. అంతే తొలుత కొంత సంశయించిన నెమలి తరువాత ఎంచక్కా వచ్చి అమె చేతిలోని గింజలను తింటూ ఆస్వాదించింది. దీనిని చూసిన కొందరు మహిళకు ఎంతటి భాగ్యం.. నెమలికి ఆహారం పెట్టే అదృష్టవంతురాలని కొనియాడారు.
She is rich by heart pic.twitter.com/q1bOLbdXO0
— Tinku_Venkatesh | ಟಿಂಕು_ವೆಂಕಟೇಶ್ (@tweets_tinku) August 1, 2020
అయితే అప్పుడప్పుడు ఇలా నెమలి వచ్చి తన వద్దనున్న ఆహార గింజలను తింటుందని మహిళ.. వీడియో షూట్ చేసిన స్థానికులతో చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. అక్కడి స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్త ఆనంద్ మహీంద్ర కంటపడింది. దీంతో ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక్కోసారి కొన్ని ఘటనలు చూస్తే ఇంకా మానవత్వం బతికే ఉంది. అందరితో సామరస్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నమ్మశక్యం కానీ భారతం.. అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు అయితే.. ఆ మహిళ చేసిన పనికి జోహార్లు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more