కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా రూపాంతరం చెందుతూ ప్రపంచంపై తన ప్రభావాన్ని చాటుతున్న తరుణంలో దానిని సమూలంగా అంతం చేయడానికి పరిశోధనలు కోనసాగుతూనే వున్నాయి. ఇప్పటివరకు పలు దేశాలు పలు రకాల వాక్సీన్లను తీసుకువచ్చినా.. అవన్నీ కరోనాను కట్టడి చేయడానికే. కాగా కరోనాను అంతం చేసేందుకు సరైన వాక్సీన్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వినియోగంలో వున్న వాక్సీన్లు కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
పలు దేశాల్లో వాక్సీన్ మిక్సింగ్ పై కూడా అధ్యయనాలు చేస్తున్నారు. వాటి ఫలితాలు మరింత ధీటుగా వున్నాయని.. అవి కరోనా మహమ్మారిపై అమోఘమైన ప్రభావాన్ని చాటుతున్నాయని కనుగొన్నారు. వీటి వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోంటున్నాయని అధ్యయన పలితాలు వెల్లడిస్తున్నాయి, దీంతో భారతదేశంలోనూ వాక్సీన్ మిక్సింగ్ అధ్యయనాలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీజీసీఐ అనుమతినిచ్చింది. తమిళనాడులోని వెల్లూర్ కాలేజీలో వ్యాక్సిన్ మిక్సింగ్పై అధ్యయనం చేపట్టనున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పౌల్ తెలిపారు.
సుమారు 300 మంది వలంటీర్లపై వెల్లూర్లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో త్వరలో ట్రయల్స్ నిర్వహించనున్నారు. వ్యాక్సిన్ మిక్సింగ్ పై స్టడీ చేపట్టాలని జూలై 29న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఓ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే మిక్సింగ్ పై గతంలో ఐసీఎంఆర్ చేసిన స్టడీకి ఇది భిన్నంగా ఉండనున్నది. ఐసీఎంఆర్ చేసిన అధ్యయనంలో తొలి టీకా రెండో టీకా వేర్వేరుగా తీసుకోవడంపై సాగగా, ఇప్పుడు తమిళనాడులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అందుకు భిన్నమైన విధంగా స్టడీ జరగనుంది. వాక్సీన్ మిక్సింగ్ లతో పాటు వాక్సీన్ కాక్ టెయిల్ పై కూడా ఇక్కడ అధ్యయనం జరగనుందని తెలుస్తోంది.
దేశంలో అందుబాటులో వున్న కొవాగ్జిన్ (బయోఎన్ టెక్), కొవిషీల్డ్ (విదేశాల్లో ఆస్ట్రాజెనెకా) టీకాలను వేర్వేరుగా ఒక్కో డోసు చొప్పున తీసుకోవడం సురక్షితమేనని ఇటీవల ఐసీఎంఆర్-ఎన్ఐవీ అధ్యయనం వెల్లడించింది. ఒకే రకమైన టీకా రెండు డోసులను తీసుకున్నవారితో పోల్చితే.. రెండు వేర్వేరు టీకా డోసులను తీసుకున్నవారిలో రోగనిరోధకశక్తి అధికంగా పెంపొందుతున్నట్టు వివరించింది. ఆల్ఫా, బీటా, డెల్టా వంటి వేరియంట్లపై ఈ టీకా మెరుగైన ఫలితాలు కనబర్చిందని పేర్కొంది. కాగా టీకా మిక్సింగ్ పై జరిపిన అద్యయనాలను మరింతగా సమీక్షించాల్సి ఉంది. ఈ వివరాలు ప్రీ-ప్రింట్ సర్వర్ ‘మెడ్ఆర్ఎక్స్ఐవీ’లో ప్రచురితమయ్యాయి.
ఉత్తరప్రదేశ్లో సిద్ధార్థ్ నగర్ లోని ఓ టీకా కేంద్రంలో తొలి అధ్యయనం జరిగింది, 18 మందికి తొలి దఫాలో కొవిషీల్డ్.. రెండో దఫాలో కొవాగ్జిన్ టీకాను ఇచ్చారు. దీంతో ఐసీఎంఆర్- ఎన్ఐవీకి చెందిన నిపుణుల బృందం వీరిపై అధ్యయనం చేసింది. ఈ క్రమంలో రెండు డోసుల కొవాగ్జిన్, రెండు డోసుల కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారిని 40 మంది చోప్పున ఎంచుకుని.. టీకాల మిక్సింగ్ తీసుకున్న 18 మందిపై మే, జూన్, 2021లో అధ్యయనం నిర్వహించారు. దీంతో మిక్సింగ్ టీ్కాలు తీసుకున్న 18 మందిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా వృద్ధి చెందినట్టు పరిశోధకులు గుర్తించారు. కాగా, మిశ్రమ టీకాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిపుణుల కమిటీ భావిస్తున్న నేపథ్యంలో వెల్లూర్ మెడికల్ కాలేజీలో మరోసారి ట్రయల్స్ నిర్వహించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more