పెగాసస్ వివాదంపై విచారణ సందర్బంగా దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సందర్భంలో ఇక్కడే మీకున్న అభిప్రాయాలను వ్యక్తపర్చాలి.. కానీ సోషల్ మీడియా ద్వారా సమాంతర చర్చలు నిర్వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించింది. కోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో అనవసర చర్చలు ఎందుకని హెచ్చరించింది. న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని ఉంచాలని పేర్కోంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత చెప్పాలి అనుకున్నది కోర్టులోనే చెప్పాలని సుప్రీం ధర్మాసనం పేర్కోంది.
ఇవాళ కేసు విచారణకు సుప్రీం ధర్మాసనం చేపట్టగా.. ఈ కేసులో విచారణకు మరికొంత సమయం కావాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన న్యాయస్థానం.. ఈ కేసు విషయంలో ఎవరూ తమ హద్దులను దాటవద్దని సూచించింది. ప్రతీ ఒక్కరికీ అవకాశం ఇస్తామని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం పేర్కోంది. పిటీషనర్లు ఏదైనా చెప్పాలనుకుంటే అది కోర్టులో చెప్పాలని సీజేఐ ఎన్వీ రమణ సూచించారు. న్యాయస్థానంలో ఈ అంశంపై సమగ్ర చర్చ జరుగుతుందని అన్నారు.
ఈ వ్యవహారంపై వచ్చిన అన్ని పిటిషన్లపై ఒకే సారి విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇజ్రాయిల్ లోని ఎన్ఎస్ఓ సాప్ట్ వేర్ సంస్థ రూపోందించిన పెగాసెస్ సాప్ట్ వేర్ తో దేశంలోని రాజకీయ, జర్నలిస్టు, సామాజిక కార్యకర్తలతో పాటు పారిశ్రామిక వేత్తల ఫోన్లపై కేంద్రం నిఘా పేట్టిందన్న అరోపణలు వున్నాయి. ఇక పెగాసస్ వ్యవహారంలో జరిగే కోర్టు విచారణను లైవ్లో ప్రసారం చేయాలని జ్యుడిషియల్ అకౌంటబులిటీ అండ్ రిఫార్మ్స్ సంస్థ కోరింది. ఈ నేపథ్యంలో సీజే రమణకు లేఖ కూడా రాసింది. పెగాసస్ స్నూపింగ్ కేసు విచారణను లైవ్లో వెబ్ ద్వారా ప్రసారం చేయాలని ఎన్జీవో సీజేఏఆర్ కోరింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more