పెగాసస్ స్పైవేర్.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసెస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారానికి రూపకర్తగా నిలిచింది మాత్రం ఎన్ఎస్ఓ గ్రూపు. ఇజ్రాయెల్ లోని ఈ సంస్థ రూపోందించిన ఈ స్పైవేర్ ఇప్పడు మన దేశ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే మన దేశంతో ధైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని పడేలా చేసిన ఈ ఘటనతో ఈ ఎన్ఎస్ఓ గ్రూప్ సంస్థలు, కార్యాలయాలపై ఇజ్రాయెల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ విషయాన్ని ఆ గ్రూప్ గురువారం ధృవీకరించింది.
అయితే తాము మాత్రం పూర్తి పారదర్శకతతో పని చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖకు చెందిన ప్రతినిధులు మా కార్యాలయాలకు వచ్చారు. వాళ్ల తనిఖీలను మేము స్వాగతిస్తున్నాం. ఇజ్రాయెల్ అధికారులతో మా కంపెనీ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోంది అని ఎన్ఎస్వో గ్రూప్ అధికార ప్రతినిధి వెల్లడించారు. తమ మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవాలని ఈ తాజా తనిఖీలు బయటపెడతాయన్న నమ్మకం తమకు ఉందని ఆ ప్రతినిధి అన్నారు.
పెగాసస్ స్పైవేర్ నిఘా వివాదంపై విచారణ జరపడానికి మంగళవారం ఇజ్రాయెల్ రక్షణ శాఖ అధికారుల బృందం ఎన్ఎస్వో గ్రూపు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ గ్రూపు అభివృద్ధి చేసిన పెగాసస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి పలువురు జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు 17 మీడియా మీడియా సంస్థల విచారణలో తేలింది. దీనిపై విచారణ జరపడానికి ఇజ్రాయెల్ పలు మంత్రిత్వశాఖ అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ అంశాన్ని తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇజ్రాయెల్ చెప్పగా.. ఎన్ఎస్వో గ్రూపు మాత్రం తమపై ఆరోపణలు అవాస్తవాలని చెబుతూ వస్తోంది. తాము ఈ సాఫ్ట్వేర్ను కేవలం ప్రభుత్వాలకే అమ్ముతామని, వాళ్లు ఎలా ఉపయోగిస్తారన్నది వాళ్ల ఇష్టమని కంపెనీ చెప్పింది. అంతేకానీ తమకు తాముగా ఈ సాప్ట్ వేర్ ను ఎవరిపైనా ఉపయోగించలేదని చెప్పింది. అయినా ఇజ్రాయిల్ దేశ అధికారులు మాత్రం దాడులు కొనసాగించి కీలక డాక్యూమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more