సూయజ్ కాలువలో అడ్డంపడి ప్రపంచ వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగించిన ఎవర్ గివెన్ నౌకను ఈజిప్టు అధికారగణం షాక్ ఇచ్చింది. జపాన్ కు చెందిన ఎవర్ గ్రీన్ నౌకను అప్పగించేందుకు ఈజిప్ట్ యంత్రాంగం భారీ డిమాండ్ ను నౌక యజమాని ముందు పెట్టింది. తమకు కలిగిన నష్టపరిహారాన్ని చెల్లించేవరకు నౌకను విడుదల చేయడానికి ఈజిప్టు ససేమిరా అంటోంది. పరిహారమే కదా.. కట్టేస్తే పోలా అనుకుంటున్నారా.. అది కట్టాలంటే జేజమ్మ దిగిరావాల్సిందే. కానీ అది కట్టకపోతే సీజ్ చేసిన నౌకను ఇవ్వడం కుదరదని ఈజిప్టు అధికారులు గంటాపథంగా చెబుతున్నారు.
ఇంతకీ ఆ పరిహార మొత్తం ఎంత అంటారా.. ఏకంగా రూ. 4100 కోట్లు (550 మిలియన్ డాలర్లు). అయితే, తాను అంత మొత్తం చెల్లించలేనని, 150 మిలియన్ డాలర్లు మాత్రం ఇవ్వగలనని నౌక యజమాని షోయ్ కిసేన్ కౌషా పేర్కొన్నారు. సూయజ్ కాలువలో అడ్డంపడిన నౌకను కదిలించి, రవాణాను పునరుద్ధరించేందుకు 600 మందికిపైగా కార్మికులు కష్టపడ్డారని, ఈ క్రమంలో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారని ఈజిప్టు ప్రభుత్వం గుర్తు చేసింది. కాబట్టి 550 మిలియన్ డాలర్లు అడగడంలో ఏమాత్రం తప్పులేదని పేర్కొంది. మరోవైపు, నష్టపరిహారం చెల్లించేంత వరకు దానిని ఈజిప్టులోనే ఉంచాలని కోర్టు ఇప్పటికే ఆదేశించింది.
ఇక ఎవర్ గ్రీన్ నౌక సూయిజ్ కాలువలో అడ్డంగా నిలవడంతో అదే మార్గంలో వెళ్లాల్సిన ఇతర దేశ వాణిజ్య నౌకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ఈ మార్గాన్ని క్లియర్ చేయడానికి వారం రోజుల సమయం కూడా పట్టిందని.. ఈ క్రమంలో ఆదాయాన్ని కూడా కోల్పోయామని ఈజిప్టు అధికారులు పేర్కోంటున్నారు, ఈ విషయంలో తమ కార్మికుల హక్కులను తాము ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయబోమని అన్నారు. మార్చి నెల ఆరంభంలో పశ్చిమ జపాన్ కు చెందిన ఎవర్ గ్రీన్ పడవ సూయిజ్ కెనాల్ లో ఇర్కుకుపోయిన విషయం తెలిసిందే. దీనిని అదే నెల 29న అధికారులు క్రమబద్దీకరించిన మార్గాన్ని క్లియర్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more