మొబైల్ ఫోన్ వినియోగదారులకు టెలికమ్యూనికేషన్ శాఖ శుభవార్తను అందించింది. ఇదివరకు ఫోన్ వినియోగదారులు పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీ పెయిడ్ కు లేదా ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మారాలంటే తమ గుర్తింపు కార్డును తీసుకుని సంబంధిత టెలికామ్ సర్వీస్ నిర్వాహక కార్యాలయానికి వెళ్లి అక్కడ తమ పేరును నమోదు చేసుకుంటే కానీ అది సాథ్యం కాదు. దీంతో పోస్టు ఫెయిడ్ కు ఓ రకం సిమ్ కార్డులు, ప్రీ పెయిడ్ కు మరో రకం సిమ్ కార్డులు ఇచ్చేవారు సర్వీసు ప్రోవైడర్లు. ఇక ఇలా మారిన నేపథ్యంలో దాదాపుగా 24 గంటల పాటు లేదా ఆరు గంటల పాటు సర్వీసులు సంబంధిత సిమ్ కార్డులకు అందేవి కూడా కాదు.
అయితే ఇకపై ఇలా మారాలంటూ ఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అసవరం లేదు. ఎలాంటి సిమ్ మార్చాల్సిన అవసరం లేదు. ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేకుండా, కనీసం సర్వీస్ ప్రోవైడర్లు కార్యాలయాలకు కూడా వెళ్లకుండా చకచకా ఇంట్లోనే కూర్చోని ఈ పనులను చక్కబెట్టుకోవచ్చు. అదెలా అంటారా...కేవలం ఓ ఓటీపీ(వన్ టైమ్ పాస్వర్డ్) ద్వారా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ జరిగేలా టెలికం శాఖకు (డాట్) టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ప్రతిపాదించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆధారాలు (పీవోసీ) ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్లకు డాట్ సూచించింది.
పీవోసీని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు డాట్ ఏడీజీ ఓ నోట్ లో తెలిపారు. టెలికామ్ సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు ప్రీపెయిడ్ నుంచి పోస్టు పెయిడ్ లేదా పోస్టు పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ గా మార్చుకోవడంలో నూతనంగా కేవైసీ తెలుసుకునే పద్దతితో మార్పులు తీసుకురావాలంటూ ఇదివరకే ప్రతిపాదనలు తీసుకువచ్చాయి. అయితే వాటిని పరిశీలించిన టెలికమ్యూనికేషన్స్ శాఖ టెలికాం సంస్థల ప్రతిపాదనలకు అమోదం తెలిపింది. అయితే మార్పులకు అవసరమయ్యూ ప్రూప్ అఫ్ కాన్సెప్ట్ లను మాత్రం భద్రంగా జాగ్రత్తపర్చాలని అదేశించింది.
దీంతో ఇకపై కనెక్షన్ను మార్చుకోదల్చుకున్న వారు తమ సర్వీస్ ప్రొవైడర్కు ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్, వెబ్సైట్, అధీకృత యాప్ ద్వారా అభ్యర్ధన పంపాల్సి ఉంటుంది. దీన్ని ఆమోదిస్తూ .. టెలికం సంస్థ ఒక ప్రత్యేక ఐడీ, ఓటీపీని మొబైల్ యూజర్ కి పంపిస్తుంది. ఈ ఓటీపీ 10 నిమిషాల దాకా చెల్లుబాటు అవుతుంది. ఓటీపీని ధృవీకరిస్తే.. కనెక్షన్ మార్పునకు యూజరు సమ్మతించినట్లుగా టెలికం సంస్థ పరిగణిస్తుంది. ఏ తేదీ, సమయం నుంచి మార్పు అమల్లోకి వస్తుందనేది సమాచారం అందజేస్తుంది. ఇలా కనెక్షన్ మారే క్రమంలో సేవల అంతరాయం గరిష్టంగా 30 నిమిషాల కంటే ఎక్కువ అంతరాయం ఉండరాదంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more