కరోనా వైరస్ మహమ్మారి రెండో దశలో విలయాన్ని సృష్టిస్తోన్న తరుణంలో దానిని నియంత్రించేందుకు వైద్యులు పలు రకాల చికిత్సను రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా కరోనా వైరస్ తీవ్రంగా వున్న రోగులకు ప్లాస్మా థెరఫీని కూడా అందుబాటులో వున్న విషయం తెలిసిందే. అయితే కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. కేంద్రం ప్లాస్మా థెరపీపై కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ రోగులకు అందించే చికిత్స విధానాల్లో పలు మార్పులు చేస్తూ ఇకపై ప్లాస్మా థెరపీ విధానంతో కరోనా రోగులకు చికిత్సను అందించకూడదని తప్పించింది.
కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి సేకరించే ప్లాస్మాతో ఇకపై చికిత్స చేయకూడదని కేంద్రం అదేశాలను జారీచేసింది. ప్లాస్మా థెరపీ పద్దతి చికిత్సను కరోనా రోగులకు చేయకూడదని స్పష్టం చేసింది. కరోనా రోగుల చికిత్సా విధానంలో నూతన మార్గదర్శకాలను ఇండియన్ మెడికల్ అండ్ రిసర్చ్ కౌన్సిల్, కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్, ఎయిమ్స్, జాయింట్ మానిటరింగ్ గ్రూప్ సంయుక్తంగా విడుదల చేశాయి. కరోనా చికిత్స విధానంలో భాగంగా గత ఏడాది ప్లాస్మా థెరపీతోనే అనేక మంది కరోనా రోగులకు చికిత్సను అందించారు. కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి పరిస్థితి విషమంగా ఉన్న బాధితులకు ఎక్కించి చికిత్స చేసేవారు.
దీనిద్వారా విషమపరిస్థితుల్లో వున్న వ్యక్తుల శరీరంలో యాంటీబాడీలు తయారై కరోనాను అడ్డుకుంటాయని డాక్టర్లు చెప్పారు. అయితే ప్లాస్మా ధెరఫీతో,, కరోనా విషమ పరిస్థితులకు జారుకున్న రోగులలో పెద్దగా ప్రతిరక్షకాలు వృద్దికావడం లేదని దీంతో ఆశించిన స్థాయిలో సానుకూల ఫలితాలు లేకపోవడంతో ప్లాస్లా థెరపీని పక్కన పెట్టారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుంటే స్వల్ప లక్షణాలుగా భావించాలని, అలాంటి వారిని హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచి చికిత్స అందించాలని సూచించింది.
ఇక రక్తంలో ఆక్సిజన్ స్థాయి 90 నుంచి 93 మధ్యన ఉన్నా.. రెస్పిరేటరీ రేటు నిమిషానికి 24 కన్నా ఎక్కువగా ఉంటే… రోగ లక్షణాలు మధ్య స్థాయిగా ఉన్నట్టు గుర్తించాలని కేంద్రం సూచింది. ఇలాంటి రోగులను ఆస్పత్రుల్లోని సాధారణ వార్డులో చేర్పించి చికిత్స అందించాలంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయులు 90 కంటే తక్కువగా ఉండి.. రెస్పిరేటేరీ రేటు నిమిషానికి 30 కంటే ఎక్కువగా ఉంటే.. సీరియస్ కేసుగా పరిగణించాలని.. ఆ లక్షణాలు ఉన్న రోగులను వెంటనే ఆస్పత్రి ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స మొదలెట్టాలని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు అసుపత్రులు నూతన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఐసీఎంఆర్ అదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more