అడ్డదారులు తొక్కైనా తన కుటుంబాన్ని, భార్య పిల్లల సంతోషం కోసమే అని ఇంటి యజమానులు భావిస్తుంటారు. కుటుంబపోషణ భారంగా మారడంతోనే తాను వక్రమార్గంలోనైనా వారిని పోషించాలని ప్రయత్నించారు చాలా మంది. కానీ మారుతున్న కాలంతో పాటు తండ్రుల అలోచనా విధానాల్లోనూ మార్పులు వస్తున్నాయి. తన భార్య, పిల్లలు అన్న అలోచనను పక్కన బెట్టేసిన వ్యక్తి తన జల్సాలకు మాత్రమే ప్రాధన్యత ఇస్తున్నాడు. అందుకోసం అవసరమైతే తన కన్న బిడ్డలను తానే ఇతరుకు బేరం పెట్టేసి.. దాంతో తన కోరికలను తీర్చుకుంటున్నారు. నిజానికి కన్న తల్లిదండ్రులు ఇంతటి నీచానికి దిగజారుతారా.? అన్న అనుమానాలు కలగక మానవు.
కానీ అదే జరిగింది. లగ్జరీ జీవితానికి అలవాటు పడిన ఓ జంట తమ బిడ్డను అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో ఓ కారును కోనుగోలు చేసింది. అమ్మమ్మ, తాతయ్యల పిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వీరి నిర్వాకం తెలిసిన వారు వారి ముఖన్ని కూడా చూడటానికి ఇష్టపడటం లేదు.. ఇక వీరి కనిపించగానే ఛీ కొడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లా తిర్వా కోత్వాలి పోలిస్ స్టేషన్ పరిధిలో నివాసం వుంటుందన్న దంపతులకు మూడు నెలల క్రితం మగ బిడ్డ సంతానం కలిగింది. కొన్ని రోజులు బాబుతో సంతోషంగా గడిపిన ఈ జంట మనస్సులో దుర్భుద్ది చేరింది.
సెకండ్ హ్యండ్ కారు కోనాలని వారు ముచ్చటపడ్డారు. అయితే అందుకు డబ్బు ఇచ్చి వున్నా లేక ఈఎంఐ రూపంలో తీసుకన్నా బాగానే వుండేది. కానీ ఈ జంట అందుకు భిన్నంగా వ్యవహరించారు, తమ వద్ద అంత డబ్బు లేకున్నా తమ కోరికను మాత్రం తీర్చుకోవాలని అనుకున్నారు. దీంతో తమ బిడ్డను అమ్మేయాలని భావించారు. మూడు నెలల పసికందును ఓ వ్యాపార వేత్తకు లక్షన్నర రూపాయలకు అమ్మేశారు. కానీ శిశువు కనిపించకపోవడంతో అమ్మమ్మ, తాతయ్యలకు అనుమానాం కలిగింది. బిడ్డ తల్లిదండ్రులే ఏదో చేసివుంటారన్న సందేహం వారిలో కలిగింది. దీంతో వారు పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో తమ స్టైయిల్ లో పోలీసులు వారిని విచారించే సరికి నిజాలు నిగ్గుతేలాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more