తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన న్యాయవాద దంపతుల కేసులో ప్రధాన నిందితుడిగా హతుడు పేర్కోన్న కుంటా శ్రీనివాస్ కు చెందిన ఆడియో టేపు నెట్టింట్లో వైరల్ గా మారింది. గుంజపడుగులోని కులదేవత ఆలయ వివాదమే హత్యకు గల ప్రధాన కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మృతుడు వామన్ రావు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నిందితుడు కుంటా శ్రీనివాస్ ఆడియోను పోలీసులు సేకరించారు. అతడి కాల్ డేటాను అనాలసిస్ చేయగా.. ‘గుడి కూలితే వామన్ రావు కూలిపోతాడు’ అని శ్రీనివాస్ మాట్లాడిన ఆడియో క్లిప్ కీలకంగా మారింది.
ఈ వీడియోలో గుంజపడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంటా శ్రీనివాస్ జిల్లా చైర్మన్ పుట్టా మధుకు ముఖ్యఅనుచరుడిగా చెప్పుకున్నాడు. తాను నిత్యం అన్నతోనే వుండాలని చెప్పిన శ్రీనివాస్.. తమ ప్రత్యర్థిని మాత్రం అదృశ్యం చేయాలని.. ఆయన కుటుంభ సభ్యులు కూడా మిస్సింగ్ కేసు పెట్టేలా చేయాలని సుపారీ గ్యాంగ్ తో ఆయన మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇందుకు గాను ఎంత మొత్తం కావాలన్న బేరసారాలను కూడా ఈ ఆడియో టేపులో స్పష్టంగా వినిపిస్తున్నాయి. సుపారీ గ్యాండ్ అడిగిన మొత్తం కన్నా అధికంగానే తాను ఇప్పిస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చాడు.
ఇక రానున్న ఐదేళ్లు తమ ప్రభుత్వమే అధికారంలో వుంటుందని.. ఈ ఐదేళ్లలో ఏం కావాలన్నా తాను చూసుకుంటానని చెప్పాడు. ఈ క్రమంలో మధన్నను నమ్మకుని గత కొన్ని ఏళ్లుగా వున్నానని, ఆయన సహాయంతో ఏకగా 26 నుంచి 28 ఎకరాల స్థలం కూడా తనకు అందిందని, అంతా మధన్న పుణ్యమేనని చెప్పుకోచ్చాడు. ఇక ఇటు మంధనిలో వున్న పోలీసు శాఖలో అందరు అధికారులు తమవారేనని చెప్పుకోచ్చిన శ్రీనివాస్.. తనపై వున్న నాలుగు కేసులను కూడా మధన్న తీయించాడని.. ఇక ఈశాఖలోనూ తమకు ఎవరూ అడ్డు చెప్పరని చెప్పకోచ్చాడు.
కాగా గుంజపడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుంటా శ్రీనివాస్పై గతంలో అనేక కబ్జా, బెదిరింపు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా అతడు సింగరేణి కార్మిక సమాఖ్య(ఎస్ఈయు)లో పనిచేశాడని వెల్లడించారు. ఇక హత్య జరిగిన సమయంలో ఘటనాస్థలంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు తేల్చిన పోలీసులు.. కుంట శ్రీనివాస్ను త్వరిగతిన అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామగుండం సీపీ సత్యనారాయణ సాయంత్రం మీడియా ముందుకు రానున్నారు. ఇక వామన్ రావు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏ–1గా కుంట శ్రీనివాస్, ఏ–2గా అక్కపాక కుమార్, ఏ–3గా వసంతరావును పేర్కొంటూ ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more