దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మీటూ ఉద్యమం అటు ప్రపంచాన్ని కూడా కుదిపేసిందన్నడంలో సందేహమే లేదు. ఎలాగోలా ఈ ఉద్యమం కాసింత శాంతించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరోమారు ఢిల్లీ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. మీటూ బాధితులైన మహిళలు తాము ఎదుర్కోన్న ఘటనలపై ఎప్పుడైనా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునని తీర్పును వెలువరించారు. ఈ కేసులో బాధితులైన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బహిర్గతం చేయడానికి కూడా సుముఖతను చూపరని న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం రామాయణ, మహభారత మతగ్రంధాల విషయాన్ని కూడా ప్రస్తావించింది. భారత్ కర్మభూమి అని, ఇక్కడ మహిళలను దేవతగా అరాధిస్తారని.. అయినా ఈ పవిత్రభూమిలోనూ మహిళలపై లైంగిక దాడులు జరగడం దురదృష్టకరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. రామాయణం, మహాభారత ఇతిహాసాల్లో మహిళలను ఏ విధంగా గౌరవించారో స్పష్టంగా కనిపిస్తుందని, అయినా ఈ దేశంలోనూ మహిళలపై లైంగికంగా దాడులకు పాల్పడటం క్షమించరానినేరం’ అంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది.
కేంద్ర మాజీ మంత్రి ఎంజే అక్బర్ తనపై లైంగిక వేదింపులకు పాల్పడ్డారంటూ జర్నలిస్ట్ ప్రియా రమణి చేసిన అరోపణలకు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఈ మేరకు సంచలన తీర్పును వెలువరించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో మాజీ కేంద్రమంత్రి ఎంజే అక్బర్ ప్రియా రమణిపై పరువు నష్టం దావా వేశారు. అమె తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, తన పరువుకు భంగంకలిగే విధంగా వ్యాఖ్యలు చేశారని కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం కీలక తీర్పునిచ్చింది.
బాధితురాలిపై ఎంజే అక్బర్ దాఖలు చేసిన పరువునష్టం దావా పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని బాధితురాలు ఎప్పుడైనా బయటకు చెప్పుకోవచ్చని స్పష్టం చేసింది. ఎంజే అక్బర్ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం.. ఆయన సెలబ్రిటీ ఇమేజ్ సహా కీర్తి ప్రతిష్టలు మహిళ విలువైన జీవితంతో తూకం వేయలేమని పేర్కోంది. ఆమె వ్యాఖ్యలతో పిటిషనర్ కు పరువు నష్టం జరిగిందని భావించేమని పేర్కొంది. ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. దీంతో ప్రియా రమణికి న్యాయస్థానంలో ఊరట లభించింది.
గత ఏడాది అక్టోబర్లో 20 ఏళ్ల క్రితం అక్బర్ తమని లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియా రమణి, ప్రేరణాసింగ్ బింద్రా, పేరు తెలియని మరో మహిళా జర్నలిస్టు ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీటిని అవాస్తవమని కొట్టి పారేసిన అక్బర్ జర్నలిస్టు ప్రియా రమణిపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఆమె తప్పుడు ఆరోపణలు చేశారంటూ పరువు నష్టం కేసు నమోదు చేశారు. దీనిని తాజాగా ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. కాగా ఎంజే అక్బర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు ప్రధానంగా రాజకీయ రంగంలో తీవ్రచర్చకు దారి తీశాయి. ప్రియా రమణి మొదలు పలువురు మహిళలు అక్బర్పై తీవ్రమైన ఆరోపణలతో మీటూ అంటూ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more