నూతన పార్లమెంటు భవనం, కేంద్ర సచివాలయం, రాష్ట్రపతి భవనం, ఇండియా గేట్ సహా దేశరాజధానిలోని పలు అభివృద్ది పనుల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రాజెక్టు విస్టాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం, స్థలం కేటాయింపు, డిజైన్ల అమోదం, పర్యావరణ అనుమతులు లభించడం వంటి వ్యవహారాలపై దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలు పిటీషన్లను దాఖలయ్యాయి. వీటిపై విచారించన న్యాయస్థానం ఇవాళ్టికీ తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఉదయం విస్టా ప్రాజెక్టుపై తీర్పును వెలువరిస్తూ పచ్చజెండాను ఊపింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై కేంద్రం చేసిన వాదనలతో సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది.
త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు విస్టా ప్రాజెక్టుకు అనుకూలంగా తీర్పును వెలువరించారు. దీంతో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు 2:1 నిష్పత్తిలో మెజార్టీ తీర్పుతో గ్రీన్ సిగ్నల్ లభించింది. జస్టిస్ ఖాన్విల్కర్ తో పాటు జస్టిస్ దినేశ్ మహేశ్వరి ఏకాభిప్రాయంతో తీర్పును రాశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాత్రం విడిగా తీర్పు కాపీని రాశారు. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్లపై కేంద్రం వాదనలతో సుప్రీం ధర్మాసనం ఏకీభవించింది. డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపులు కూడా సరిగ్గానే ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది.
కాగా ప్రాజెక్టు నిర్మాణానికి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతులు తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఆ అనుమతులను తక్షణం తెచ్చుకోవాలని సూచించిన న్యాయస్థానం.. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్ టవర్లను ఏర్పాటు చేయాలని అదేశించింది, యాంటీ స్మాగ్ గన్ లను ఉపయోగించాలని కూడా అదేశించింది. ఆ తరువాతనే నిర్మాణాలను చేపట్టాలని సూచనలు చేసింది. కాగా ఈ కేసు విచారణ సమయంలోనే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు శంకుస్థాపనకు అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం అంగీకారం తెలిపింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ ప్రాజక్టుకు శంకుస్థాపన చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more