(Image source from: Indiatoday.in)
బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టి వేల కోట్ల రూపాయలతో బోర్డు తిప్పేస్తున్న సంస్థలు ఈ మధ్యకాలంలో అనేకం వున్నాయి. చెన్నైకి చెందిన సంస్థలతో పాటు ఉత్తర భారత దేశానికి చెందిన సంస్థలు కూడా ఇప్పటికే ఈ జాబితాలో చేరిపోయాయి. ఇక తాజాగా మరో హైదరాబాదీ సంస్థ కూడా ఈ జాబితాలో చేరింది. కొన్ని వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశారు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ. వారి జాబితాలో చేరేందుకు హైదరాబాద్ ఇన్ఫ్రా సంస్థ ఐవీఆర్ సీఎల్ ఎండీ సుధీర్ రెడ్డి కూడా చేరిపోయారు.
అయితే ఈయన విదేశాలకైతే పారిపోలేదుగానీ.. 8 బ్యాంకులకు రూ.4,837 కోట్ల కుచ్చుటోపీ పెట్టాడు. ఆ బ్యాంకులన్నింటికీ నేతృత్వం వహిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫిర్యాదుతో ఆయనగారి బాగోతం బయటపడింది. సీబీఐ కేసు నమోదు చేసింది. ఐవీఆర్ సీఎల్ అనే మౌలిక వసతుల సంస్థ తమ నేతృత్వంలోని 8 బ్యాంకుల కన్సార్టియంను మోసం చేసిందని సీబీఐకి ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ అధికారులతో కలిసి బ్యాంకులను సంస్థ ముంచిందని పేర్కొంది. తమ రుణాలను చెల్లించకపోవడంతో పాటు ఎగనామం పెడుతున్న నేపథ్యంలో ఎస్పీఐ సీబిఐకి పిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన సీబిఐ ప్రాథమిక విచారణ చేయగా, ఎస్బీఐతో పాటుగా మరో ఎనమిది బ్యాంకులకు ఐవీఆర్సీఎల్ కుచ్చుటోపి పెట్టిందని తేలింది, ఐడీబీఐ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి ఐవీఆర్ సీఎల్ రుణాలు తీసుకుంది. ఎస్బీఐ ఫిర్యాదుతో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇ. సుధీర్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. బలరామిరెడ్డి, తప్పుడు మార్గాల్లో రుణాలు ఇచ్చేందుకు సహకరించిన ప్రభుత్వ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ అధికారి ఆర్కే గౌర్ వెల్లడించారు.
వేరే పార్టీలకు పేమెంట్ చేయాల్సి ఉందని చెప్పి లెటర్ ఆఫ్ క్రెడిట్స్ (రుణ పత్రం) కింద బ్యాంకుల నుంచి సంస్థ రుణాలు తీసుకున్నా.. వాటిని తిరిగి చెల్లించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఆ మొత్తాన్ని అడ్డదారుల్లో సంస్థ ఖాతాల్లోకి మళ్లించిందని వివరించారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైదరాబాద్ లోని నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేసింది. సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు చెప్పారు. కాగా, ఐవీఆర్ సీఎల్ సంస్థ 25 ఏళ్లుగా పర్యావరణం, నీటిపారుదల, రవాణా, నిర్మాణ రంగం, విద్యుత్ సరఫరా, గనుల రంగాల్లో వ్యాపారం చేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more