యావత్ ప్రపంచవ్యాప్తంగా వున్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలానికి ప్రత్యేకత వుంది. ఇక్కడ కలువైన అమ్మవారు కూడా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కావడం.. అదిదంపతులుగా కొలువబడే పార్వతీ పరమేశ్వరుల చెందిన పవిత్ర ఫుణ్యస్థలం కాబట్టి అనాదిగా ఎంతో మంది మహర్షులు, రుషులు, సాధుసంతవులు ఇక్కడ నెలకొన్న పంచమఠాల్లో అద్వైతశక్తిని పోందారని చరిత్ర చెబుతున్న సత్యం. వారి శివైక్యం అయిన విషయం కూడా అప్పట్లో తెలిసేది కాదు. కొందరు సమాధి కాగా, మరికొందరు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ కూడా తమ తోపోదీక్షను కొనసాగించేవారు. అయితే వారికి అప్పట్లో దర్శించిన భక్తులు వారికి సమర్పించిన కానుకలు కూడా అక్కడే వదిలివెళ్లి వెళ్లేవారు.
అలా వదిలివెళ్లిన కానుకలు ఆలయ జీర్ణోద్దరణ కార్యక్రమాల సందర్భంగా బయటపడుతున్నాయి. గతంతో 2017లో కూడా మఠం జీర్ణోద్దరణ పనులు చేపడుతుండగా బయటపడిన పురాతన వెండి, బంగారు నాణేలు.. తాజాగా మరోమారు కూడా అలాంటి పురాతన నాణేలతో పాటు తామ్రపత్రాలు కూడా బయటపడ్డాయి. శ్రీశైలంలోని పంచ మఠాల్లో ఒకటైన ఘంటామఠం ప్రాంగణంలోని చిన్న శివాలయ పునరుద్ధరణ పనులు చేస్తుండగా గోడల నుంచి పురాతన తామ్ర శాసనాలు, వెండి నాణేలు బయటపడ్డాయి. మూడు తామ్రపత్రాలు, 245 వెండి నాణేలు లభ్యమైనట్టు అధికారులు తెలిపారు.
తామ్రశాసనాలపై నాగరి, కన్నడ లిపితో పాటు, శివలింగానికి రాజు నమస్కరిస్తున్నట్టు, నంది, గోవు చిత్రాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇవి రాజులు సాధువులను సందర్శించిన నేపథ్యంలో సమర్పించిన పత్రాలుగా కూడా పేర్కోంటున్నారు. పురాతన నాణేలు బయటపడిన సమాచారం అందుకున్న దేవస్థానం ఈవో రామారావు, తహసీల్దారు రాజేంద్రసింగ్, ఎస్సై హరిప్రసాద్లు ఆలయానికి చేరుకుని వాటిని పరిశీలించారు. వెండినాణేలను 1800-1900 సంవత్సరాల మధ్య బ్రిటిష్ పాలన నాటివిగా అధికారులు గుర్తించారు. తామ్ర పత్రాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more