(Image source from: hindi.sakshi.com)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొమ్మది మంది పాలిట శాఫంగా మారింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మద్యం లభ్యం కాకపోవడంతో చేతులను శుభ్రం చేసుకునే హ్యాండ్ శానిటైజర్ ను సేవించడంతో అసువులు బాసారు. కరోనా వైరస్ ఉద్దృతి అంతకంతకూ పెరుగుతన్న క్రమంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై పది రోజుల క్రితమే ఏపీ సర్కార్ నిషేదం విధించింది. దీంతో తొలుత ఒకరు మరణించగా, క్రమంగా ఇవాళ ఉదయానికి ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికంగా పెను సంచలనంగా మారిన ఈ ఘటనలో వివరాల్లోకి వెళ్తే.. గత పది రోజులుగా మద్యం దుకాణాలు తెరవకపోవడంతో గత కొన్ని రోజులుగా మద్యానికి అలవాటు పడిన కొందరు శానిటైజర్లను తీసుకుని సేవిస్తున్నారు. ఇలా సేవించిన వారిలో ఒక్కరుగా ఇవాళ ఉదయానికి ఏకంగా తొమ్మది మంది మరణించారు. అయితే శానిటైజర్లను తాగడం మాత్రం స్థానిక అమ్మవారి ఆలయం వద్ద ఉండే ఇద్దరు యాచకులు ప్రారంభించారని తెలుస్తోంది. వీరు మద్యానికి బానిసలై.. మద్యం లభించకపోవడంతో.. మరో మార్గం లేక వీరు కొన్ని రోజులుగా శానిటైజర్లు తాగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇలా శానిటైజర్ తాగిన వారిలో ఓ వ్యక్తి గురువారం రాత్రి కడుపులో తీవ్ర మంటతో చనిపోయాడు. కాగా మరో యాచకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటుండగా స్థానికులు 108కి సమాచారం అందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
కానీ వారి ప్రయత్నాలన్నీ నిష్పలమయ్యాయి, 108 సిబ్బంది బాధితుడ్ని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అతను మరణించాడు. ఇదే విధంగా కురిచేడులోని పోలీస్ స్టేషన్ సమీపంలో నివాసం ఉండే కడియం రమణయ్య(28) గురువారం ఉదయం శానిటైజర్, నాటు సారా కలిపి తాగుతుండగా స్థానికులు గుర్తించి వారించారు. అయినప్పటికీ ఆయన తాగి ఇంటికి వెళ్లిపోయాడు. రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. దీంతో రమణయ్యను కుటుంబసభ్యులు 108 అంబులెన్సు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్సులో దర్శి ఆసుపత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యంలోనే రమణయ్య చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు.
ఇక ఇదే విధంగా శానిటైజర్ ను మద్యంలా భావించి సేవించిన మరో ఆరుగురు కూడా అనంతవాయువులలో కలసిపోయారు. ఇవాళ ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. శానిటైజర్ మద్యం కాదని, అందులో మెథానాల్ అనే రసాయనం వుంటుందని, అది విషపూరితమైనదని వైద్యులు పేర్కోంటున్నారు. చేతులను శుభ్రపర్చేందుక మాత్రమే.. అందులోనూ వైరస్ ను సంహారిణి మనుషులకు సేవించడానికి వీలులేదని ఇది పూర్తిగా హానికరమని చెబుతున్నారు. ఇక కురిచేడులో శానిటైజర్ సేవించి ఇవాళ మరణించిన వారిని అనుగొండ శ్రీను (25), భోగెమ్ తిరుపతయ్య(37), గుంటక రామిరెడ్డి(60, కడియం రమణయ్య(28) రమణయ్య(65), రాజారెడ్డి(65), బాబు(40), ఛార్లెస్ (45), అగస్టీన్(47)గా గుర్తించారు. కరోనా కేసులు పెరగడంతో కురిచేడు ప్రాంతంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఈ ఘటన సంభవించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more