రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన తరువాత సచిన్ పైలట్ మరోసారి ఇవాళ స్పందించారు. ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకోంది. అందుకు తగ్గట్టుగానే బీజేపి కూడా ఆయన ద్వారాలు తెరిచే వున్నాయని సంకేతాలను పంపింది. దీంతో జరగుతునన్న ప్రచారంపై తొలిసారి సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడుతూ... తాను బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. తాను అటువంటి ప్రణాళికలు ఏమీ వేసుకోలేదని వివరణ ఇచ్చారు. తాను బీజేపీలో చేరట్లేదని మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సచిన్ పేర్కొన్నారు. అయితే, సచిన్ తన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీలో తాను చేరుతున్నానంటూ కొందరు చేస్తోన్న వ్యాఖ్యలు తనను అవమానించడానికేనని సచిన్ పైలట్ చెప్పారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడినేనంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. తాను బీజేపీలో చేరుతున్నానంటూ జరుగుతోన్న ప్రచారం సరికాదని, తాను బీజేపీని ఓడించడానికి తాను ఇన్నాళ్లు కష్టపడ్డానని చెప్పిన ఆయన.. అలాంటి పార్టీలో తాను ఎందుకు చేరుతానని ఎదురు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నుంచి తాను ఎలాంటి ప్రత్యేక అధికారాలను కోరుకోవడం లేదన్న ఆయన.. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నదే తన డిమాండ్ అని స్పష్టం చేశారు. రాజస్థాన్ అభివృద్ధికి పాటుపడుదామని అనుకుంటున్న తనను, తన అనుచరులను గెహ్లాట్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తన వద్దకు ఫైళ్లు పంపవద్దని, తన మాట వినవద్దని అధికారులకు సూచిస్తున్నారని అన్నారు. ప్రజలకు తానిచ్చిన హామీలు నెరవేర్చకుంటే తనకు వారెలా విలువ ఇస్తారని పైలట్ ప్రశ్నించారు. బీజేపీతో కలిసి రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని సచిన్ కొట్టిపడేశారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయిన తర్వాతి నుంచి గెహ్లాట్ మద్దతుదారులు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఆత్మగౌరవం కోసం ఏడాది కాలంగా గెహ్లాట్ తో తాను అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నానని సచిన్ వివరించారు. తనకు ఎదురైన ఇబ్బందులను గతంలో అధిష్ఠానం దూతల వద్ద ప్రస్తావించానని, గెహ్లాట్ దృష్టికి కూడా తీసుకెళ్లానని, అయినా ఎలాంటి ఫలితమూ లేకుండా పోయిందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more