ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు పరిశోధనలు ప్రారంభించాయి. అలోపతి మెడిసిన్ లో రెమిడెసివీర్ మందును కూడా బాధితులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే మరోవైపు ఈ మహమ్మారి నియంత్రణకు అలోపతిలోనే కాక ఆయుర్వేదంలోనూ ఔషదాన్ని కనుగొనే ప్రయత్నాలు కూడా కొనసాగాయి. ప్రస్తుతం కరోనా ఆయుర్వేద ఔషదంపై క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి, భారత్, అమెరికాలోని ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు ఇందుకోసం ఏకమయ్యారు.
ఆయుర్వేద మందులతో సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారని వాషింగ్టన్ లోని భారత రాయబారి తరణ్ జీత్ సింగ్ సంధూ అన్నారు. భారత్, అమెరికాకు చెందిన నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు, వైద్యులు వర్చువల్ సమావేశంలో పాల్గొని ఆయుర్వేద శాస్త్రంలో కరోనా మహమ్మారికి ఔషదాన్ని కనుగొనేందుకు ఒక్క కూటమిగా ఏర్పడ్డారని తరణ్ జీత్ వెల్లడించారు. కొవిడ్ -19పై పోరాడేందుకు వీరంతా ఒక్కతాటిపైకి వచ్చారని తెలిపారు. ‘సంయుక్త పరిశోధన, బోధన, శిక్షణ కార్యక్రమాల ద్వారా ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు మా సంస్థలన్నీ సహకరిస్తున్నాయి. కరోనా వైరస్పై క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు రెండు దేశాల ఆయుర్వేద నిపుణులు, పరిశోధకులు చేతులు కలిపారు’ అని సంధూ తెలిపారు.
తమ శాస్త్రవేత్తలు ఆయుర్వేద రంగంలో తమకున్న అనుభవం, విజ్ఞానం, పరిశోధన అంశాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు సమ్మతించారరని తరణ్ జీత్ తెలిపారు. భారత్, అమెరికా శాస్త్ర సాంకేతిక వేదిక (ఐయూఎస్ఎస్టీఎఫ్) తమకొచ్చిన ప్రతిపాదనలు వేగంగా పరిష్కరిస్తోందని పేర్కొన్నారు. భారత ఔషధ కంపెనీలు ప్రపంచంలోనే అతితక్కువ ధరకే మందులు, వ్యాక్సిన్లను అందించే స్థాయికి ఎదిగాయని ప్రశంసించారు. మహమ్మారిపై పోరాటంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత వ్యాక్సిన్ కంపెనీలు, అమెరికా సంస్థల మధ్య కనీసం మూడు సహకార ఒప్పందాలు కొనసాగుతున్నాయన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more